ODI WC 2023: ప్రపంచకప్‌ విశిష్ట అతిథిగా రజినీకాంత్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.. భారత్‌ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన విశిష్ట అతిథిగా ప్రపంచకప్‌కు హాజరవుతారని బీసీసీఐ వెల్లడించింది.

Updated : 20 Sep 2023 09:47 IST

చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.. భారత్‌ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన విశిష్ట అతిథిగా ప్రపంచకప్‌కు హాజరవుతారని బీసీసీఐ వెల్లడించింది. మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా.. రజినీకాంత్‌ను చెన్నైలో కలిసి ప్రపంచకప్‌ బంగారు టికెట్‌ను అందించి  టోర్నీకి ఆహ్వానించారు. ‘‘తలైవా ప్రపంచకప్‌కు విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం’’ అని బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. అమితాబ్‌ బచ్చన్‌, సచిన్‌ తెందుల్కర్‌ సహా పలువురు ప్రముఖులకు బీసీసీఐ బంగారు టికెట్‌ అందజేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ వచ్చే నెల 5న అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు