ICC: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో సెహ్వాగ్, ఎడుల్జీ
భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ.. శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాకు సోమవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. తమ కెరీర్లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
దుబాయ్: భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ.. శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాకు సోమవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. తమ కెరీర్లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించిన భారత తొలి మహిళా క్రికెటర్గా ఎడుల్జీ రికార్డు సృష్టించింది. 1976-1993 మధ్యలో ఎడుల్జీ 54 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. తన ఎడమచేతి వాటం స్పిన్తో వందకు పైగా వికెట్లు తీసింది. 1999-2013 మధ్యలో సెహ్వాగ్ టెస్టుల్లో 8,586.. వన్డేల్లో 8,273 పరుగులు సాధించాడు. వన్డేల్లో 96, టెస్టుల్లో 40 వికెట్లు తీసుకున్నాడు. 1984-2003 మధ్యలో డిసిల్వా టెస్టుల్లో 6,361.. వన్డేల్లో 9,284 పరుగులు రాబట్టాడు. టెస్టుల్లో 29, వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టాడు. 1996లో డిసిల్వా, 2011లో సెహ్వాగ్.. ప్రపంచకప్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!