IND vs NZ Semi final: ఎవరు నేటి హీరోలు?
ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున హీరోలు ఎందరో. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున హీరోలు ఎందరో. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతను 500 మార్కును దాటేశాడు. కోహ్లి ఒకప్పటి ఫామ్తో చెలరేగిపోతున్నాడు. టోర్నీ టాప్స్కోరర్ అతనే. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడారు. శుభ్మన్ కూడా రోహిత్తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలనే ఇస్తున్నాడు. సూర్యకుమార్ ఒక మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్లో బుమ్రా డాట్బాల్స్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సమయోచితంగా వికెట్లూ తీస్తున్నాడు. షమి అవకాశం అందుకున్నప్పటి నుంచి ఎలా రెచ్చిపోతున్నాడో తెలిసిందే. సిరాజ్ బుల్లెట్ బంతులతో విజృంభిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా సైతం ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తున్నారు.
మొత్తంగా జట్టు జట్టంతా రాణిస్తోంది. సమష్టిగా చెలరేగుతోంది. మరి సెమీస్లో ఎవరు హీరోలుగా నిలిచి జట్టును ఫైనల్ గడప తొక్కిస్తారన్నది ఆసక్తికరం. గత మూడు ప్రపంచకప్ల్లోనూ సెమీస్లో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లి.. ఈసారి లెక్కలు సరిచేయాల్సి ఉంది. రోహిత్ సైతం నాకౌట్లో జట్టుకు మంచి ఆరంభాన్నిస్తాడని ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ రాణించి మిగతా బ్యాటర్లూ తలో చేయి వేస్తే భారీ స్కోరు చేయడం, పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదు. ఇక టోర్నీలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్న బౌలింగ్ విభాగం.. నాకౌట్లోనూ అదే స్థాయిలో రాణిస్తేనే ఇప్పటిదాకా సాధించిన ఘనతలకు సార్థకత వస్తుంది. ఆరంభంలో బుమ్రా, పవర్ ప్లే తర్వాత షమి.. మధ్య ఓవర్లలో స్పిన్ ద్వయం కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టుకు మంచి ఆరంభం దక్కినా నిరుత్సాహ పడకుండా వికెట్లు తీయడం.. ఆరంభంలో వికెట్లు పడగొడితే ఆ తీవ్రతను చివరిదాకా కొనసాగించి తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడం కీలకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?