India vs Australia: 2003 - 2023.. ఏం మారింది?
గంగూలీ, సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్, జహీర్ ఖాన్, శ్రీనాథ్, నెహ్రా.. ఇలా మహామహులైన ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియా 2003లో మంచి అంచనాలతో ప్రపంచకప్ బరిలోకి దిగింది.
క్రికెట్లో భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) ఫైనల్ అంటే చాలు.. అభిమానులు 2003 ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోతారు. రోజులు, నెలలు కాదు కొన్నేళ్ల పాటు వెంటాడిన ఆ చేదు జ్ఞాపకాలతో గుండెలు బరువెక్కుతాయి. పేలవ ఆరంభం తర్వాత అద్భుత ప్రదర్శనతో సౌరభ్(Sourav Ganguly) సేన ఫైనల్ చేరగానే ఇక మనదే ప్రపంచకప్ అనుకున్న సమయంలో కంగారూలు కొట్టింది మామూలు దెబ్బ కాదు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో భారత్కు అదే ప్రత్యర్థి ఎదురవుతోంది. కానీ అప్పటికి ఇప్పటికీ కథ చాలా మారింది. మరి కంగారూల బాకీని రోహిత్సేన తీర్చేస్తుందా?
ఈనాడు క్రీడావిభాగం : గంగూలీ, సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్, జహీర్ ఖాన్, శ్రీనాథ్, నెహ్రా.. ఇలా మహామహులైన ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియా 2003లో మంచి అంచనాలతో ప్రపంచకప్ బరిలోకి దిగింది. కానీ రెండో మ్యాచ్లో 125 పరుగులకే కుప్పకూలి ఆస్ట్రేలియా చేతిలో చిత్తవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుని మన జట్టు శవయాత్రలు చేసే వరకు వెళ్లింది. కానీ కొన్ని వారాలు గడిచేసరికి అదే జట్టును నెత్తిన పెట్టుకున్నారు. తొలి మ్యాచ్ పరాభవం తర్వాత అద్భుతంగా పుంజుకుని ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరింది దాదాసేన. అదే ఊపులో కప్పు కూడా కొట్టేస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ సగం ఇన్నింగ్స్ అయ్యేసరికే ఫలితం తేలిపోయింది. పాంటింగ్ (121 బంతుల్లో 140 నాటౌట్) సహా కంగారూ బ్యాటర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయిన భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆసీస్ స్కోరు 359/2. ఈ రోజుల్లో అంటే 400 లక్ష్యమైనా జట్లు పట్టు వదలకుండా పోరాడుతున్నాయి కానీ.. మూడొందల ఛేదనే చాలా కష్టంగా ఉన్న ఆ రోజుల్లో 360 లక్ష్యం అనగానే ఓటమి తప్పదని తేలిపోయింది. సచిన్ (4) ఆరంభంలోనే వెనుదిరగ్గానే మ్యాచ్ మీద ఆశలు పోయాయి. సెహ్వాగ్ (82) పోరాటం అంతరాన్ని మాత్రమే తగ్గించింది. 125 పరుగుల తేడాతో పరాజయం పాలై కప్పును దూరం చేసుకుంది టీమ్ఇండియా. అయితే ఆ టోర్నీలో గంగూలీ సేన ఎంత బాగా ఆడినా.. అప్పటికి ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం మామూలుగా లేదు. గిల్క్రిస్ట్, హేడెన్, పాంటింగ్, మార్టిన్, బెవాన్, సైమండ్స్లతో బ్యాటింగ్.. మెక్గ్రాత్, బ్రెట్లీ, బికెల్, హాగ్లతో బౌలింగ్ దుర్బేధ్యంగా ఉండేది. ప్రపంచకప్లో ఆ జట్టు పక్కా ప్రణాళికతో ఆడేది. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో ఎదురుదాడే మంత్రంగా సాగే ఆస్ట్రేలియా ఆటను తట్టుకోవడం బలమైన ప్రత్యర్థులకు కూడా సాధ్యమయ్యేది కాదు. ఆరంభం నుంచే భారత్ను ఒత్తిడిలోకి నెట్టి కోలుకునే అవకాశమే లేకుండా చేయడంతో దాదాసేనకు పరాభవం తప్పలేదు.
మరిప్పుడు..?
పాంటింగ్(Ricky Ponting) తరం దిగ్గజాలు నిష్క్రమించాక సంధి దశలో.. కొన్నేళ్ల ముందు బాల్టాంపరింగ్ కుంభకోణం తమ దేశ క్రికెట్ను సంక్షోభంలోకి నెట్టినపుడు ఆస్ట్రేలియా కొంత కాలం పాటు ఇబ్బంది పడింది. ఆయా సమయాల్లో ఆ జట్టు పనైపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ రెండు సందర్భాలను దాటి 2015 వన్డే ప్రపంచకప్ విజయం, 2022 టెస్టు ఛాంపియన్షిప్ గెలుపుతో తన స్థాయిని చాటింది. ఆటగాళ్లు మారినా.. ఆస్ట్రేలియా క్రికెట్లో ప్రొఫెషనలిజానికి లోటు ఉండదు. ఓటమిని ఒప్పుకోకుండా తుదికంటా పోరాడే తీరు వారిని భిన్నంగా నిలబెడుతుంది. కాబట్టి ఈసారి కూడా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీని రెండు ఓటములతో మొదలుపెట్టి తర్వాత ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరిన జట్టది. అఫ్గానిస్థాన్పై ఘోర పరాభవం తప్పదనుకున్నాక గెలిచిన తీరు అసామాన్యం. దక్షిణాఫ్రికాతో సెమీస్లోనూ ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. ఇవి ఆ జట్టు పోరాటతత్వాన్ని చాటేవే. కానీ అదే సమయంలో ఆస్ట్రేలియా ఒకప్పట్లా దుర్బేధ్యం కాదనడానికి ఈ మ్యాచ్లే ఉదాహరణ. నిజానికి 2003తో పోలిస్తే రెండు జట్లు భిన్నమైన స్థితిలో ఉన్నాయిప్పుడు. అప్పటి ఆస్ట్రేలియా స్థాయిలో ఇప్పుడు భారత్ ఆధిపత్యం చలాయిస్తోంది. అజేయంగా సాగిపోతోంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న మన జట్టు.. అప్పటి ఆస్ట్రేలియా తరహాలోనే పక్కా ప్రణాళికతో ఆడుతోంది. బ్యాటింగ్లో ఎదురుదాడి చేస్తోంది. బౌలింగ్లో ఆరంభం నుంచే ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ సాగుతోంది. సొంతగడ్డపై ఆడుతుండటం మన జట్టు బలాన్ని పెంచేదే. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అయినా.. భారత్తో పోలిస్తే బలహీనమే. లీగ్ దశ తొలి మ్యాచ్లోనే భారత్.. కంగారూలను ఓడించింది. మన జట్టు ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పతాక స్థాయిలో ఉంది. అప్పుడు ఆసీస్ను చూసి మనవాళ్లు కంగారు పడ్డట్లు.. ఇప్పుడు మన జట్టును చూసి ప్రత్యర్థే భయపడే పరిస్థితి ఉంది. కాకపోతే ప్రత్యర్థిని ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. చిన్న అవకాశం వచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్ను తమ వైపు లాగేస్తారు కాబట్టి.. ఏ దశలోనూ ఉదాసీనతకు తావివ్వకుండా ఆరంభం నుంచి చివరి వరకు ఒకే రకమైన తీవ్రతను చూపించాలి. ఇప్పటిదాకా సాగిన ఆటతీరునే ఫైనల్లోనూ కొనసాగిస్తే.. ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే 2003 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం కష్టమేమీ కాదు.
అత్యుత్తమ జట్టుతో ఆడాలనుకున్నాం
‘‘ఫైనల్లో అత్యుత్తమ జట్టుతో ఆడాలనుకున్నాం. ఇప్పటి వరకు టోర్నీలో టీమ్ఇండియానే అత్యుత్తమ జట్టు. మా రెండు జట్లు ఫైనల్ బెర్తులు దక్కించుకున్నాయి. అదే ప్రపంచకప్ గొప్పదనం. టోర్నీలో అజేయంగా నిలిచిన జట్టుతో మేం తలపడనున్నాం. తొలి మ్యాచ్లో వాళ్లతోనే ఆడాం. చివరి పోరూ వాళ్లతోనే. ప్రపంచకప్కు ఇంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది. అహ్మదాబాద్ వెళ్లాక పిచ్ కొత్తదా.. పాతదా అన్నది తెలుసుకుంటాం’’
స్టార్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి