Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు.
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. కానీ కోచింగ్ ద్రవిడ్కు పూల పాన్పేమీ కాలేదు. 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. ఆరంభంలోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కోహ్లి కెప్టెన్సీపై రగడ జట్టులో ఎంత అలజడి రేపిందో తెలిసిందే. అ అశాంతిని చల్లార్చి, జట్టు ఆటపై పూర్తిగా ఏకాగ్రత నిలిపేలా చేయడమే ద్రవిడ్ సాధించిన మొదటి విజయం. కానీ కోచ్గా మొదట్లో ద్రవిడ్కు అంతగా మంచి మార్కులేమీ పడలేదు. మేజర్ టోర్నీల్లో జట్టు ప్రదర్శనే అందుకు కారణం. 2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్పుల్లో టీమ్ఇండియా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ జట్టు ఓడిపోవడంతో ద్రవిడ్పై విమర్శలు తప్పలేదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, మౌనంగా ప్రపంచకప్కు జట్టును ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం చేశాడు మిస్టర్ డిపెండబుల్. తగిన కూర్పు కోసం ఏడాది ముందు నుంచే ప్రక్రియను మొదలెట్టాడు.
అతడు చేసిన మొదటి పని.. ప్రపంచకప్లో ఆడగలరు, వారి అవసరం ఉంది అనుకున్న ఆటగాళ్లను గుర్తించి వారిపైనే దృష్టిసారించడం. ఆ ఆటగాళ్లకు తగినన్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం కల్పించడం. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్.. (దాదాపు) 24 మంది ఆటగాళ్లతో ఓ పూల్ను సిద్ధం చేశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే.. ప్రపంచకప్కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్లోని వాళ్లే. ఇది దాటి మరొకరు కనిపించరు. ఇందులో నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేశారు. ద్రవిడ్ ముందు చూపునకు, పక్కా ప్రణాళికకు ఇది ఓ సూచిక. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల ఫామ్పై, ఫిట్నెస్పై ఎన్ని అనుమానాలు, విమర్శలు వ్యక్తమైనా.. ప్రపంచకప్ జట్టుకు వారి ఎంపికపై వ్యతిరేకత వ్యక్తమైనా ద్రవిడ్ తగ్గలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లకు వెన్నుదన్నుగా నిలిచాడు. తీవ్ర వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డ బుమ్రాను సైతం తొందరపాటు లేకుండా మెగా టోర్నీకి సిద్ధం చేసిన తీరును మెచ్చుకోవాల్సిందే.
ప్రపంచకప్లో టీమ్ఇండియా అప్రతిహత విజయాల్లోనూ ద్రవిడ్ ముద్ర స్పష్టం. ఒక్కో ఆటగాడికి ఒక్కో ప్రత్యేక బాధ్యతను అప్పగించడం ఎంత గొప్ప ఫలితాన్నిచ్చిందో వేరే చెప్పక్కర్లేదు. ఉదాహరణ ఆరంభంలో ఎటాకింగ్కు దిగే పాత్ర రోహిత్దైతే.. ఆ తర్వాత ఓ వైపు ఇరుసులా నిలబడి మరోవైపు ఆటగాళ్లు దూకుడుగా ఆడేలా వీలు కల్పించే బాధ్యత విరాట్ కోహ్లీది. ప్రక్రియలో తాత్కాలిక ఎదురుదెబ్బలు తగిలినా ద్రవిడ్.. తన ప్రపంచకప్ ప్రణాళిక నుంచి పక్కకు జరగలేదు. జట్టులో విపరీతంగా మార్పులూ చేయలేదు. అన్నింటికన్నా మిన్నగా తన స్నేహశీలతతో ఆటగాళ్లందరి విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందడం ద్రవిడ్ సాధించిన అతి పెద్ద విజయం. ఇదే జట్టు విజయవంతం కావడానికి మూలం. ఒక్క రోజు తడబడ్డ కారణంగా భారత్ ప్రపంచకప్ నెగ్గకపోయినా.. జట్టుకు మార్గనిర్దేశం చేసిన తీరుతో కోచ్ ద్రవిడ్ బీసీసీఐ సహా అందరినీ మెప్పించాడనడంలో సందేహం లేదు. ఫలితమే కోచ్గా మరో ఇన్నింగ్స్!
ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!