IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది.
గువాహటి: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. పేసర్ ప్రసిధ్ కృష్ణ 4 ఓవర్లలో 68 పరుగులిచ్చి టీ20ల్లో భారత్ తరఫున ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు. ‘‘బౌలర్ల ప్రదర్శన ఆందోళన కలిగించట్లేదు. తడి బంతితో బౌలింగ్ చేస్తున్నట్లుగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. మంచు పరిస్థితుల్లో ఓవర్కు 12 లేదా 13, 14 పరుగుల ఛేదన కూడా సాధ్యమే. తొలి మ్యాచ్లో 210 పరుగుల లక్ష్యాన్ని మేం సునాయాసంగా ఛేదించాం. కాబట్టి బౌలింగ్ ప్రదర్శనపై ఆందోళన అవసరం లేదు. పరిస్థితులు బౌలర్లకు కఠినంగా ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. మ్యాక్స్వెల్ అద్భుతంగా ఆడాడు. అత్యంత క్లిష్టమైన ఇన్నింగ్స్ అది. మా బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించారు. మంచు విపరీతంగా ఉండటంతో బంతి జారిపోతుంది’’ అని రుతురాజ్ వివరించాడు.
సిరీస్ విలువ తగ్గిపోయింది
గువాహటి: వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే జరుగుతుండడం వల్ల భారత్, ఆస్ట్రేలియా మధ్య అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ విలువ తగ్గిపోయిందని ఆసీస్ మాజీ ఆటగాడు మైకెల్ హసి అన్నాడు. అతి క్రికెట్ వల్ల ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా ఆలసిపోతున్నారని అభిప్రాయపడ్డాడు. భారత్, ఆసీస్ మధ్య సిరీస్లో అత్యుత్తమ జట్లు తలపడట్లేదని హసి అన్నాడు ‘‘ఈ టీ20 సిరీస్ విలువ తగ్గిపోయిందని భావిస్తున్నా. ప్రపంచకప్లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు టీ20 సిరీస్లో ఉండాల్సిన వాళ్లే. టెస్టు సిరీస్కు వెళ్లడానికి వాళ్లు ఇంటికైనా వెళ్లిపోయారు లేదా విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అని హసి అన్నాడు. ‘‘అత్యుత్తమ ఆసీస్ టీ20 జట్టు.. అత్యుత్తమ భారత టీ20 జట్టుతో తలపడట్లేదు’’ అని చెప్పాడు. రెండు జట్ల నుంచి చాలా మంది ఆటగాళ్లు టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!