India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు.
టెస్టు జట్టుకు రోహిత్ కెప్టెన్
వన్డేలకు రాహుల్, టీ20లకు సూర్య
దిల్లీ
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా(India vs South Africa) సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. టెస్టు కెప్టెన్ రోహిత్.. ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కోహ్లి కూడా.
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ... గురువారం జట్లను ప్రకటించింది. డిసెంబరు 26న ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్లో రోహిత్ నేతృత్వంలో పోటీపడే భారత జట్టుకు బుమ్రా వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. వన్డే, టీ20 సిరీస్ల నుంచి తనకు విశ్రాంతినివ్వాలన్న కోహ్లి విజ్ఞప్తిని కూడా బీసీసీఐ మన్నించింది. హార్దిక్ పాండ్య గైర్హాజరీలో టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. రోహిత్ విశ్రాంతి నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ కేఎల్ రాహుల్కు లభించింది. వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో చాలా మంది టెస్టులు లేదా టీ20లకు లేకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు.. శ్రేయస్ అయ్యర్, ముకేశ్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే మూడు జట్లలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో భారత్ మూడేసి వన్డేలు, టీ20లు, రెండు టెస్టుల్లో ఆడనుంది. డిసెంబరు 10న టీ20 మ్యాచ్తో ఈ పర్యటన ఆరంభమవుతుంది.
వన్డే జట్టు కొత్తగా..: ప్రస్తుతానికి వన్డేలకు ప్రాధాన్యం తక్కువే అయినా.. రాహుల్ నేతృత్వంలోని వన్డే జట్టు కొత్తగా కనిపిస్తోంది. రజత్ పటీదార్, సాయి సుదర్శన్, రింకు సింగ్ ఈ ఫార్మాట్లో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. టెస్టుల్లో లేని కుల్దీప్ యాదవ్ వన్డే, టీ20 జట్లు రెండింటిలోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్లో ఆడలేకపోయిన చాహల్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్కి టీ20ల్లో అవకాశం దక్కించుకోగా.. ఈ ఫార్మాట్లో అక్షర్ పటేల్పై వేటు పడింది. జడేజా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. సంజు శాంసన్ వన్డే జట్టులో స్థానం సంపాదించాడు.
భారత్-ఎ కెప్టెన్గా భరత్: దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్-ఎ జట్టుగా కెప్టెన్గా కోన భరత్ నియమితుడయ్యాడు. ఈ పర్యటనలో భారత్-ఎ రెండు నాలుగు రోజులు మ్యాచ్లు ఆడుతుంది. రెండు మ్యాచ్లకు భిన్న జట్లను ఎంపిక చేశారు. ఓ మ్యాచ్లో తిలక్ వర్మ కూడా ఆడతాడు.
వాళ్ల కథ ముగిసినట్లేనా!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో 89 పరుగులు చేసిన రహానెకు అదే చివరి టెస్టేమో. మరో సీనియర్ పుజారా పరిస్థితి కూడా అంతే. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో పునరాగమనం చేసిన నేపథ్యంలో సెలక్టర్లు వెటరన్ ఆటగాళ్లపై వేటు వేశారు. వీళ్లిద్దరితో పాటు ఉమేశ్ యాదవ్కు కూడా అవకాశం దక్కలేదు. టెస్టు జట్టులో స్థానం కోసం కుర్రాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నందున ఈ ముగ్గురు మళ్లీ టెస్టు జట్టులోకి రావడం కష్టమే.
టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్.
వన్డే జట్టు
రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, చాహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.
టెస్టు జట్టు
రోహిత్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, శ్రేయస్, రుతురాజ్, ఇషాన్ కిషన్, రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమి, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?