India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు.
టెస్టు జట్టుకు రోహిత్ కెప్టెన్
వన్డేలకు రాహుల్, టీ20లకు సూర్య
దిల్లీ
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా(India vs South Africa) సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. టెస్టు కెప్టెన్ రోహిత్.. ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కోహ్లి కూడా.
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ... గురువారం జట్లను ప్రకటించింది. డిసెంబరు 26న ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్లో రోహిత్ నేతృత్వంలో పోటీపడే భారత జట్టుకు బుమ్రా వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. వన్డే, టీ20 సిరీస్ల నుంచి తనకు విశ్రాంతినివ్వాలన్న కోహ్లి విజ్ఞప్తిని కూడా బీసీసీఐ మన్నించింది. హార్దిక్ పాండ్య గైర్హాజరీలో టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. రోహిత్ విశ్రాంతి నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ కేఎల్ రాహుల్కు లభించింది. వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో చాలా మంది టెస్టులు లేదా టీ20లకు లేకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు.. శ్రేయస్ అయ్యర్, ముకేశ్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే మూడు జట్లలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో భారత్ మూడేసి వన్డేలు, టీ20లు, రెండు టెస్టుల్లో ఆడనుంది. డిసెంబరు 10న టీ20 మ్యాచ్తో ఈ పర్యటన ఆరంభమవుతుంది.
వన్డే జట్టు కొత్తగా..: ప్రస్తుతానికి వన్డేలకు ప్రాధాన్యం తక్కువే అయినా.. రాహుల్ నేతృత్వంలోని వన్డే జట్టు కొత్తగా కనిపిస్తోంది. రజత్ పటీదార్, సాయి సుదర్శన్, రింకు సింగ్ ఈ ఫార్మాట్లో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. టెస్టుల్లో లేని కుల్దీప్ యాదవ్ వన్డే, టీ20 జట్లు రెండింటిలోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్లో ఆడలేకపోయిన చాహల్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్కి టీ20ల్లో అవకాశం దక్కించుకోగా.. ఈ ఫార్మాట్లో అక్షర్ పటేల్పై వేటు పడింది. జడేజా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. సంజు శాంసన్ వన్డే జట్టులో స్థానం సంపాదించాడు.
భారత్-ఎ కెప్టెన్గా భరత్: దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్-ఎ జట్టుగా కెప్టెన్గా కోన భరత్ నియమితుడయ్యాడు. ఈ పర్యటనలో భారత్-ఎ రెండు నాలుగు రోజులు మ్యాచ్లు ఆడుతుంది. రెండు మ్యాచ్లకు భిన్న జట్లను ఎంపిక చేశారు. ఓ మ్యాచ్లో తిలక్ వర్మ కూడా ఆడతాడు.
వాళ్ల కథ ముగిసినట్లేనా!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో 89 పరుగులు చేసిన రహానెకు అదే చివరి టెస్టేమో. మరో సీనియర్ పుజారా పరిస్థితి కూడా అంతే. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో పునరాగమనం చేసిన నేపథ్యంలో సెలక్టర్లు వెటరన్ ఆటగాళ్లపై వేటు వేశారు. వీళ్లిద్దరితో పాటు ఉమేశ్ యాదవ్కు కూడా అవకాశం దక్కలేదు. టెస్టు జట్టులో స్థానం కోసం కుర్రాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నందున ఈ ముగ్గురు మళ్లీ టెస్టు జట్టులోకి రావడం కష్టమే.
టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్.
వన్డే జట్టు
రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, చాహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.
టెస్టు జట్టు
రోహిత్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, శ్రేయస్, రుతురాజ్, ఇషాన్ కిషన్, రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమి, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్