Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్‌ ఏడ్చారు

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏడ్చారని ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చెప్పాడు.

Updated : 01 Dec 2023 07:13 IST

చెన్నై: ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏడ్చారని ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) చెప్పాడు. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డాం. రోహిత్‌, కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే టీమ్‌ఇండియాకు ఎంతో అనుభవం ఉంది. మున్ముందు ఏం చేయాలో అందరికి తెలుసు’’ అని అన్నాడు. రోహిత్‌ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ ధోనిని ఉత్తమ కెప్టెన్‌గా పేర్కొంటారు. అయితే రోహిత్‌ కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. అతడికి జట్టులో ప్రతి ఒక్కరి గురించి అవగాహన ఉంది. అందరి ఇష్టాయిష్టాలు తెలుసు. ప్రతి ఒక్కరితో సమన్వయం కూడా ఉంది. అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు’’ అని అశ్విన్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని