Pro Kabaddi League: టైటాన్స్ మరోసారి..
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ టైటాన్స్కు ఓటమి తప్పలేదు.
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్కు గట్టిపోటీనిచ్చిన టైటాన్స్ బుధవారం పట్నా పైరేట్స్తో మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది. 28-50 తేడాతో చిత్తుగా ఓడింది. అంచనాలకు తగ్గట్టుగా పవన్ (11) రాణించినా మిగతా వారి నుంచి అతడికి సరైన మద్దతు లభించలేదు. మ్యాచ్ ఆరంభంలో కాసేపు టైటాన్స్ పోటాపోటీగా తలపడింది. పవన్ సూపర్ రెయిడ్ కారణంగా 6-3తో ఆధిక్యంలో వెళ్లింది. మరోవైపు పట్నా స్టార్ రెయిడర్ సచిన్ (14) దూకుడు ప్రదర్శించినా.. 8-7తో ఆధిక్యంలోనే నిలిచింది. కానీ సచిన్ జోరు కొనసాగిన వేళ టైటాన్స్ నెమ్మదిగా వెనకబడిపోయింది. 13వ నిమిషంలో టైటాన్స్ను ఆలౌట్ చేసిన పట్నా.. ప్రథమార్ధం ముగియడానికి ముందు మరోసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసి పాయింట్లు కొల్లగొట్టింది. విరామ సమయానికి 28-16తో ఆధిక్యంలో నిలిచిన ఆ జట్టు.. ఆ తర్వాత తగ్గలేదు. పవన్ మినహా మిగతా ఆటగాళ్ల నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడంతో టైటాన్స్ ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఆ జట్టులో సందీప్ (4)దే రెండో అత్యుత్తమ ప్రదర్శన. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57-27తో హరియాణ స్టీలర్స్పై ఘన విజయం సాధించింది.
ప్రొ కబడ్డీలో ఈనాడు
బెంగాల్ వారియర్స్ × జైపుర్ పింక్ పాంథర్స్ రాత్రి 8 నుంచి
గుజరాత్ జెయింట్స్ × పట్నా పైరేట్స్ రాత్రి 9 నుంచి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.