అథ్లెట్లకు కఠోర ఆర్మీ శిక్షణ
వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఒలింపిక్స్ కోసం దక్షిణ కొరియా నిర్ణయం
సియోల్: వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వందలాది అథ్లెట్లకు మూడు రోజుల పాటు కఠోరమైన సైన్యం తరహా శిక్షణ ఇప్పించేందుకు కొరియా మెరీన్ కార్ప్స్ శిబిరానికి పంపించాలని వివిధ క్రీడా సంఘాలకు కొరియా ఒలింపిక్ కమిటీ సూచించింది. మహిళలు సహా సుమారు 320 మంది అథ్లెట్లు ఈ శిబిరంలో పాల్గొనబోతున్నారు. గతంలో భారీ క్రీడా టోర్నీలకు ముందు సైన్యం తరహా శిక్షణ తీసుకోవాలని క్రీడా సంఘాలు తమ అథ్లెట్లకు చెబుతుండేవి. కానీ ఒలింపిక్ కమిటీ ఇలా సూచించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో పసిడి పతకాల సంఖ్యలో చైనా, జపాన్ తర్వాత దక్షిణ కొరియా నిలవడంతో ఒలింపిక్ కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఈ శిబిరం నిర్వహణ కోసం ఇంకా చర్చలు సాగుతున్నాయి. కానీ గతంలో ఒలింపిక్స్కు ముందు నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఫెన్సర్లు, రెజ్లర్లు, హ్యాండ్బాల్ అథ్లెట్లు ర్యాపెలింగ్ కోర్సుతో పాటు 140 కిలోల పడవలను తలలపై మోశారు. తాజాగా దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంకా సైన్యం పాలనలోనే దేశం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఒలింపిక్స్లో ఏదైనా పతకం గెలిచే పురుష అథ్లెట్లు 18 నుంచి 21 నెలలు కచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నిబంధన నుంచి మినహాయింపు పొందుతారన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు