స్పెయిన్ చేతిలో భారత్ ఓటమి
జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం.
జూ.హాకీ ప్రపంచకప్
కౌలాలంపుర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. గురువారం పూల్-సి రెండో మ్యాచ్లో ఉత్తమ్సింగ్ బృందం 1-4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో చిత్తయింది. పెనాల్టీకార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలం కావడం, బలహీనమైన డిఫెన్స్ భారత్ను దెబ్బ కొట్టాయి. ఈ మ్యాచ్లో ఆరంభంలోనే భారత్కు షాక్ తగిలింది. తొలి నిమిషంలో కాబ్రె గోల్ చేసి స్పెయిన్కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఆండ్రెస్ (18వ) బంతిని లక్ష్యానికి చేర్చడంతో స్పెయిన్ ఆధిక్యం రెట్టింపు అయింది. ఈ మధ్యలో భారత్కు పెనాల్టీకార్నర్లు దక్కినా నిష్ఫలమయ్యాయి. మూడో క్వార్టర్లో రోహిత్ (33వ) గోల్ చేయడంతో ఎట్టకేలకు భారత్ ఖాతా తెరిచింది. కానీ ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ కాబ్రె (41వ) మరో గోల్ సాధించి స్పెయిన్కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. చివర్లో ఆండ్రెస్ (60వ) మరో గోల్ కొట్టి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. భారత్ (3 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. కొరియా కూడా ఇన్నే పాయింట్లు సాధించినా గోల్స్ అంతరంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. స్పెయిన్ (6) అగ్రస్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్