NeeraJ Chopra: అందుకు నీరజే కారణం
భారత అథ్లెటిక్స్లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్ త్రో అథ్లెట్ కిశోర్ కుమార్ పేర్కొన్నాడు.
దిల్లీ: భారత అథ్లెటిక్స్లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్ త్రో అథ్లెట్ కిశోర్ కుమార్ పేర్కొన్నాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కిశోర్ ఈ ఏడాది ఆసియా క్రీడల్లో 87.54 మీటర్ల ప్రదర్శనతో రజతం నెగ్గిన సంగతి తెలిసిందే. ‘‘వచ్చే ఏడాది ఈటెను విసిరే దూరం గురించి ఆలోచించడం లేదు. పారిస్ ఒలింపిక్స్లో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన రాబట్టాలనుకుంటున్నా. నీరజ్ చోప్రాను ఆరాధిస్తా. భారత అథ్లెటిక్స్లో జరుగుతున్న మంచి విషయాలకు అతనే కారణం. నా టెక్నిక్ విషయంలో అతనిచ్చిన సలహాలు పాటిస్తా. ఒలింపిక్స్కు ముందు అన్ని రకాలుగా మెరుగవుతా. ఎక్కువ భాగం భారత్లోనే శిక్షణ కొనసాగిస్తా. ఒలింపిక్స్కు ముందు విదేశాల్లో కొన్ని పోటీల్లో పాల్గొంటా’’ అని గురువారం ‘ది మ్యాన్ వూ మేడ్ హిస్టరీ: ది నీరజ్ చోప్రా స్టోరీ’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో కిశోర్ తెలిపాడు. ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన మహిళా జావెలిన్ త్రో అథ్లెట్ అన్ను రాణి కూడా ఈ కార్యక్రమంలో పొల్గొంది. ‘‘చెరకు గడను విసురుతూ నా కెరీర్ మొదలెట్టా. అమ్మాయికి ఆటలెందుకని గ్రామస్థులు అన్నారు. మా నాన్నకు కూడా జావెలిన్ విసరడం నచ్చలేదు. అందుకే పాఠశాల నుంచి తెచ్చుకున్న జావెలిన్ను నాన్నకు కనబడకుండా దాచేదాణ్ని. కానీ ఓ రోజు అసలు విషయం తెలిసింది. అప్పుడు ఆయన కోపాన్ని భరించాల్సి వచ్చింది’’ అని అన్ను వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే