Virat Kohli: విరాట్‌ నిర్ణయం ఏమిటో?

నిరుడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత ఓటమి తర్వాత రోహిత్‌, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు.

Updated : 08 Dec 2023 07:33 IST

నిరుడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత ఓటమి తర్వాత రోహిత్‌, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కూ దూరంగా ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్‌ ఉండాలని బోర్డు కోరుకుంటోంది. మరి కోహ్లి పరిస్థితి ఏంటన్నదే తేలాలి. ఇటీవల ఒకే వన్డే ప్రపంచకప్‌లో 700కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లోనూ అతడికి అసాధారణ రికార్డుంది. మరి రోహిత్‌లా అతడు టీ20 ఫార్మాట్లో ఆడతాడా? ఈ విషయంపై కోహ్లితో చర్చించాలని బీసీసీఐ భావిస్తోందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం కోహ్లి ఆడే మూడో స్థానంలో ఇషాన్‌ బరిలో దిగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు