Sreesanth - Gambhir: గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని మాజీ పేసర్ శ్రీశాంత్ గురువారం ఆరోపించాడు.
సూరత్: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని మాజీ పేసర్ శ్రీశాంత్ గురువారం ఆరోపించాడు. లెజెండ్స్ లీగ్లో బుధవారం ఇండియన్ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘గంభీర్ నన్ను ఫిక్సర్, ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నాడు. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్లో అతను నన్ను ఫిక్సర్ అన్నాడు. ఏమంటున్నావు అని తనని అడిగా. శాంతపరిచేందుకు ప్రయత్నించిన అంపైర్లతోనూ అతను అలాగే మాట్లాడాడు. నేను ఒక్క చెడు మాట కూడా అనలేదు. ఓవర్ అయిపోయిన తర్వాత అతనెందుకు అలా చేశాడో అర్థం కావట్లేదు. దయచేసి వాస్తవానికి మద్దతుగా నిలవండి. గంభీర్ ఎంతో మందితో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతని వర్గం వాళ్లు మాత్రం గంభీర్ సిక్సర్, సిక్సర్ అన్నాడని చెబుతున్నారు. కానీ అతను ఫిక్సర్ అనే అన్నాడు. ఇలా మాట్లాడటం సరికాదు. ఈ విషయాన్ని వదిలేద్దామనుకున్నా. కానీ అతని మద్దతుదారులు గంభీర్ను కాపాడాలని చూస్తున్నారు. అదనపు జీతానికి ఆశపడే పీఆర్ల మాటలు నమ్మొద్దని కోరుతున్నా’’ అని ఇన్స్టాగ్రామ్ లైవ్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు.
అనంతరం టీమ్ఇండియా జెర్సీలో నవ్వుతూ ఉన్న తన ఫొటోను ఎక్స్లో పోస్టు చేసిన గంభీర్.. ‘‘ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాలని చూసినప్పుడు నవ్వుతూ ఉండాలి’’ అనే శీర్షిక పెట్టాడు. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్పై బీసీసీఐ మొదట జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం కోర్టు 2019లో దీన్ని ఏడేళ్లకు తగ్గించడంతో శ్రీశాంత్ నిషేధం నుంచి బయటపడ్డాడు. బుధవారం కూడా ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ గంభీర్పై శ్రీశాంత్ రెచ్చిపోయాడు. ఏ కారణంగా లేకుండానే సహచర ఆటగాళ్లతో గంభీర్ గొడవ పెట్టుకుంటాడని, సెహ్వాగ్ సహా ఏ సీనియర్ ఆటగాడి పట్ల అతనికి గౌరవం లేదని ఆరోపించాడు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ లఖ్నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ హోదాలో గంభీర్.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లితో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..