జైపుర్-బెంగాల్ సగం సగం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది.
అహ్మదాబాద్
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది. ఈ మ్యాచ్ ఆరంభంలో డిఫెన్స్లో సత్తా చాటిన జైపుర్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ట్యాకిల్ పాయింట్లు సాధించి విరామ సమయానికి 13-9తో ముందంజలో నిలిచింది. కానీ బెంగాల్ పట్టు వదలకుండా పోరాడింది. ఒక్కో పాయింట్ కూడగడుతూ అంతరాన్ని తగ్గించింది. బెంగాల్ జట్టులో భవానీ రాజ్పుత్ (10) సూపర్ టెన్తో అదరగొట్టడంతో జైపుర్ను ఆలౌట్ చేసిన బెంగాల్ 16-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. జైపుర్ తగ్గలేదు. శ్రీకాంత్ జాదవ్ (7) జోరుతో మళ్లీ గేమ్లోకి వచ్చింది. గేమ్ అటుఇటు మొగ్గుతూ.. చివరికి టైగా ముగిసింది. మరో హోరాహోరీ మ్యాచ్లో పట్నా పైరేట్స్ 33-30తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. సుధాకర్ (6), నీరజ్ కుమార్ (4), సచిన్ (4), సందీప్ కుమార్ (4) పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ ఆరంభంలో గుజరాత్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్నా పుంజుకుని స్కోరు సమం చేసింది. విరామ సమయానికి రెండు జట్లు 12-12తో సమానంగా నిలిచాయి. ఆ తర్వాత పట్నా దూకుడుగా ఆడింది. సచిన్ విజృంభించడంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒక దశలో ఆ జట్టు 11 పాయింట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. కానీ రాకేశ్ (11) సూపర్-10 సాధించడంతో గుజరాత్ పుంజుకుని పాయింట్ల అంతరాన్ని తగ్గించింది. ఆఖర్లో మ్యాచ్పై పట్నా పట్టు కొనసాగించడంతో గుజరాత్కు ఓటమి తప్పలేదు.
ప్రొ కబడ్డీలో ఈనాడు
బెంగళూరు బుల్స్ × దబాంగ్ దిల్లీ (రా. 8 నుంచి)
పుణెరి పల్టాన్ × యు ముంబా (రా. 9 నుంచి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి