IND vs SA: రేసులోకి వచ్చేదెవరో?
ఓపెనర్ ఎవరు? మూడో స్థానంలో వచ్చేదెవరు? వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడేదెవరు? ఫినిషర్ దొరికేశాడా? యువ స్పిన్నర్ అవకాశం పట్టేస్తాడా?
ఓపెనర్ ఎవరు? మూడో స్థానంలో వచ్చేదెవరు? వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడేదెవరు? ఫినిషర్ దొరికేశాడా? యువ స్పిన్నర్ అవకాశం పట్టేస్తాడా? పేస్ భారాన్ని మోసేదెవరు?.. ఇలా టీమ్ఇండియా టీ20 జట్టుపై ఎన్నో ప్రశ్నలు. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు కూర్పుపై ఎన్నో సందేహాలు. టీ20 ప్రపంచకప్కు ముందు ఇక భారత్ ఆడేది ఆరు టీ20లే. ఇవి కాకుండా ఐపీఎల్. జట్టులో చోటు కోసం గట్టి పోటీ ఉంది. మరి రేసులో దూసుకెళ్లేదెవరు? టీ20 మెగా టోర్నీ ఆడాలనే లక్ష్యంతో ఉన్న కుర్రాళ్లకు దక్షిణాఫ్రికాతో సిరీస్ రూపంలో సవాలు ఎదురవనుంది. ఆదివారమే సిరీస్ ఆరంభం. మరి మెరిసేదెవరు? సెలక్టర్లను మెప్పించేదెవరు?
ఈనాడు క్రీడావిభాగం
గత నెలలో వన్డే ప్రపంచకప్ ముగిసింది. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో సాగిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తాపడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్లో అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్లో విజయం కోసం భారత జట్టు ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. ఆస్ట్రేలియాతో ముగిసిన అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్తోనే పొట్టి కప్పు దిశగా జట్టు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. మరి ఈ సిరీస్లో రాణించిన యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ లాంటి యువ ఆటగాళ్లు ప్రపంచకప్లో ఆడతారా? మన తిలక్ వర్మ పరిస్థితి ఏమిటీ? వన్డేల్లో అంటే జట్టు కూర్పు కుదిరింది. ప్రతి ఒక్క ఆటగాడికి ఒక్కో పాత్ర ఉంది. కానీ టీ20ల్లో తుది జట్టు తరచూ మారుతోంది. అత్యుత్తమ కూర్పు కోసం జట్టు మేనేజ్మెంట్ ప్రయోగాలు చేస్తోంది. కానీ ఐపీఎల్ కాకుండా ప్రపంచకప్కు ముందు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో, వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్తో మూడేసి టీ20లు మాత్రమే భారత్ ఆడనుంది.
ఎవరికో చోటు?: టీ20 ప్రపంచకప్లోనూ జట్టును నడిపించాలని బీసీసీఐ కోరిన నేపథ్యంలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగడం దాదాపుగా ఖాయం. బుమ్రా, శ్రేయస్, సూర్యకుమార్, హార్దిక్, జడేజా కూడా ఆడతారు. ఇక మిగిలిన స్థానాల కోసం పోటీ ఉంది. ముందుగా ఫినిషర్గా రింకుకు జట్టులో కచ్చితంగా చోటుంటుందనే చెప్పాలి. ఆసీస్తో సిరీస్లో అదరగొట్టిన అతను.. రాబోయే మ్యాచ్ల్లోనూ ఇదే నిలకడ కొనసాగిస్తే అతని స్థానానికి ఢోకా ఉండదు. ఇక రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు యశస్వి, శుభ్మన్, రుతురాజ్ పోటీపడుతున్నారు. కంగారూ జట్టుపై రుతురాజ్ సెంచరీ చేయగా.. యశస్వి ధనాధన్ ఇన్నింగ్స్లతో అలరించాడు. కానీ మరో ఓపెనర్గా ఆడే అవకాశాలు శుభ్మన్కే ఎక్కువ. యశస్వి రిజర్వ్ ఓపెనర్గా ఉండే ఆస్కారముంది. అది కాకుండా వచ్చే సిరీస్ల్లో, ఐపీఎల్లో శుభ్మన్ కంటే గొప్పగా యశస్వి రాణిస్తే అంచనాలు తప్పొచ్చు. మూడో స్థానం కోసం ఇషాన్ కిషన్ను జట్టు మేనేజ్మెంట్ సిద్ధం చేస్తోంది. వికెట్ కీపర్గా ఎవరాడతారు? అన్నది మరో కఠిన ప్రశ్నే. అప్పటివరకూ కోలుకుని, మ్యాచ్లాడి సత్తాచాటితే పంత్ రేసులోకి రావొచ్చు. లేదంటే కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ మధ్య పోటీ తప్పదు. ప్రస్తుతం మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తూ వికెట్ కీపింగ్ చేసే ఆటగాడి కోసం జట్టు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఐపీఎల్లో లఖ్నవూ తరపున రాహుల్ ఓపెనర్గా ఆడాడు. మరి టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతను మిడిలార్డర్కు వెళ్తాడా? చూడాలి. అయితే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు అతణ్ని ఎంపిక చేయలేదు. దీంతో జట్టు ప్రణాళికల్లో అతను లేడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్ల్లో జితేశ్ శర్మను పరీక్షించి చూడగా ఫర్వాలేదనిపించాడు. సఫారీ గడ్డపైనా అతణ్ని వికెట్కీపర్గా ఆడించే అవకాశాలున్నాయి. ఇక శ్రేయస్ నిలకడగా రాణిస్తుండటంతో హైదరాబాదీ తిలక్ వర్మకు జట్టులో చోటు లేకుండా పోతోంది. జట్టులో చోటివ్వక తప్పని పరిస్థితి కల్పించాలంటే అవకాశం వస్తే తిలక్ అసాధారణంగా రాణించాల్సిందే. రెండో స్పిన్నర్ స్థానం కోసం కుల్దీప్ యాదవ్తో రవి బిష్ణోయ్ ఢీ కొడుతున్నాడు. ఆసీస్తో సిరీస్లో నిలకడగా వికెట్లు తీసిన బిష్ణోయ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గానూ నిలిచాడు. కానీ కుల్దీప్ మళ్లీ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్ బిష్ణోయ్కు కఠిన సవాలే. మరోవైపు అర్ష్దీప్, ముకేశ్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ