India vs England: ఒక్క రోజులో.. ఎన్ని మెరుపులో!
కోరుకున్నట్లే యశస్వి ద్విశతకం సాధించాడు. స్కోరు 400కు చేరువైంది. కానీ బజ్బాల్ ఆటతో బెంబేలెత్తించే ఇంగ్లాండ్.. బ్యాటింగ్ అంత కష్టంగా లేని పిచ్పై చెలరేగకుండా ఉంటుందా అన్న సందేహం! అందుకు తగ్గట్లే ఇంగ్లిష్ జట్టు స్కోరు 20 ఓవర్లలో 105/1కు చేరుకుంది.
నిప్పులు చెరిగిన బుమ్రా
ఇంగ్లాండ్ 253
యశస్వి ద్విశతకం.. భారత్ 396
విశాఖలో రెండో టెస్టు
కోరుకున్నట్లే యశస్వి ద్విశతకం సాధించాడు. స్కోరు 400కు చేరువైంది. కానీ బజ్బాల్ ఆటతో బెంబేలెత్తించే ఇంగ్లాండ్.. బ్యాటింగ్ అంత కష్టంగా లేని పిచ్పై చెలరేగకుండా ఉంటుందా అన్న సందేహం! అందుకు తగ్గట్లే ఇంగ్లిష్ జట్టు స్కోరు 20 ఓవర్లలో 105/1కు చేరుకుంది. కానీ అప్పుడో సూపర్ క్యాచ్.. ఆ తర్వాత ఓ బౌలర్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో కథ మొత్తం మారిపోయింది. చివరికి టీమ్ఇండియా తిరుగులేని స్థితిలి నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా విశాఖలో అద్భుత బౌలింగ్ విన్యాసాలు ప్రదర్శించిన ఇంగ్లాండ్ కకావికలమైంది. శనివారం ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. సాయంత్రానికి రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. మధ్యలో ఎన్నో మలుపులు, మెరుపులు!
విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో భారత్ (India vs England) పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన రోహిత్ సేన.. రెండో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్లో 28/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్ (15 బ్యాటింగ్), రోహిత్ శర్మ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా (6/45) సంచలన బౌలింగ్కు తలవంచిన ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ (3/71) కూడా రాణించాడు. క్రాలీ (76; 78 బంతుల్లో 11×4, 2×6) టాప్స్కోరర్. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 336/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (209; 290 బంతుల్లో 19×4, 7×6) తొలి డబుల్ సెంచరీ అందుకున్నాడు. ఇంగ్లిష్ బౌలర్లలో అండర్సన్ (3/47), షోయబ్ బషీర్ (3/138), రెహాన్ అహ్మద్ (3/65) మెరిశారు.
ఆ క్యాచే మలుపు..: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ను ఓపెనర్లు క్రాలీ, డకెట్ (21) దూకుడుగా మొదలెట్టారు. అశ్విన్ బౌలింగ్లో క్రాలీ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను గిల్ పట్టలేకపోయాడు. ఆ వెంటనే బుమ్రా ఓవర్లో క్రాలీ నాలుగు ఫోర్లు కొట్టాడు. 10 ఓవర్లలోనే 59 పరుగులొచ్చాయి. ఆ దశలో డకెట్ను కుల్దీప్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే పోప్ (23)ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని భరత్ వృథా చేశాడు. క్రాలీ 52 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. 20 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 దాటింది. పరిస్థితి భారత్ చేజారుతోందేమో అనిపించిన సమయంలో అక్షర్ (1/24)కు రోహిత్ బంతి అందించడం.. శ్రేయస్ అద్భుతమైన క్యాచ్తో క్రాలీ పెవిలియన్ చేరడంతో కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత 22 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. బంతిని చూస్తూ వెనక్కి పరుగెత్తి, ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్ను శ్రేయస్ అందుకున్న తీరు అమోఘం. ఈ వికెట్ పడ్డాక మరో ఎండ్ నుంచి బుమ్రా రెచ్చిపోయాడు. ఆడటానికి సాధ్యం కాని రివర్స్ స్వింగ్ బంతులతో విజృంభించాడు. 4-2-3-2.. ఇవీ ఆ స్పెల్లో బుమ్రా గణాంకాలు. రూట్ (5)పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఎనిమిదోసారి ఔట్ చేశాడు. బంతిని వదలాలా లేదా అనే అనుమానంతోనే ఆడిన రూట్ స్లిప్లో గిల్ చేతికి చిక్కాడు. తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా తిరుగులేని యార్కర్తో పోప్ స్టంప్స్ను ఎగరగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 155/4తో టీ విరామానికి వెళ్లింది.
బుమ్రా మరింతగా..: చివరి సెషన్లో బుమ్రా మరింతగా చెలరేగాడు. బంతిని లోపలికి, బయటకు పంపిస్తూ.. బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వరుసగా రెండు మొయిడెన్లు వేసిన అతను.. బెయిర్స్టో (25)కు గాలం వేశాడు. ఇన్స్వింగర్కు ఎల్బీ కావొద్దనే ఉద్దేశంతో బెయిర్స్టో కొంచెం వెనక్కి జరిగి బ్యాటింగ్ చేశాడు. ఇది గమనించిన బుమ్రా.. ఆఫ్స్టంప్ ఆవల బంతి వేసి ఆడేలా ప్రేరేపించాడు. అది ఎడ్జ్ తీసుకుని గిల్ చేతుల్లో పడింది. ఇక కుల్దీప్ స్పిన్, అధిక బౌన్స్ను ఉపయోగించుకున్నాడు. అతని ఓవర్లో ఆఫ్స్టంప్ ఆవల పడ్డ బంతి తిరుగుతుందేమోనని అడ్డుకునేందుకు ఫోక్స్ (6) ప్రయత్నించాడు. కానీ అది అనుకున్నంత తిరగకుండా వెళ్లి ఆఫ్స్టంప్ను ముద్దాడింది. కొద్దిసేపటికే షార్ట్ మిడ్వికెట్లో గాల్లోకి ఎగిరి గిల్ పట్టిన క్యాచ్కు రెహాన్ (6) నిస్సహాయంగా పెవిలియన్ చేరాడు. వికెట్లు పడతుండటంతో స్టోక్స్ (47) బాదుడుకు తెరలేపి, ఫాలోఆన్ గండం నుంచి జట్టును బయటపడేశాడు. కుల్దీప్ బౌలింగ్లో అతనాడిన బంతి స్లిప్లో ఉన్న రోహిత్ వేళ్లను తాకుతూ వెళ్లింది. హార్ట్లీ (21) కూడా భారీ షాట్లు ఆడాడు. వీళ్ల భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతుండటంతో మరోసారి బుమ్రా బౌలింగ్కు వచ్చాడు. వరుస ఓవర్లలో స్టోక్స్, హార్ట్లీని పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్ను బౌల్డ్ చేశాడు. ఇంకేం చేయాలి? అన్నట్లు బ్యాట్ కిందపడేసి స్టోక్స్ నిరాశ వ్యక్తం చేశాడు. చివరిగా అండర్సన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు బుమ్రా ముగింపు పలికాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 209; రోహిత్ (సి) పోప్ (బి) బషీర్ 14; శుభ్మన్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34; శ్రేయస్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 27; రజత్ (బి) రెహాన్ 32; అక్షర్ (సి) రెహాన్ (బి) బషీర్ 27; భరత్ (సి) బషీర్ (బి) రెహాన్ 17; అశ్విన్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 20; కుల్దీప్ నాటౌట్ 8; బుమ్రా (సి) రూట్ (బి) రెహాన్ 6; ముకేశ్ (సి) రూట్ (బి) బషీర్ 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం: (112 ఓవర్లలో ఆలౌట్) 396
వికెట్ల పతనం: 1-40, 2-89, 3-179, 4-249, 5-301, 6-330, 7-364, 8-383, 9-395
బౌలింగ్: అండర్సన్ 25-4-47-3; రూట్ 14-0-71-0; హార్ట్లీ 18-2-74-1; షోయబ్ బషీర్ 38-1-138-3; రెహాన్ అహ్మద్ 17-2-65-3
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 76; డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21; పోప్ (బి) బుమ్రా 23; రూట్ (సి) శుభ్మన్ (బి) బుమ్రా 5; బెయిర్స్టో (సి) శుభ్మన్ (బి) బుమ్రా 25; స్టోక్స్ (బి) బుమ్రా 47; ఫోక్స్ (బి) కుల్దీప్ 6; రెహాన్ (సి) శుభ్మన్ (బి) కుల్దీప్ 6; హార్ట్లీ (సి) శుభ్మన్ (బి) బుమ్రా 21; అండర్సన్ ఎల్బీ (బి) బుమ్రా 6; బషీర్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 9; మొత్తం: (55.5 ఓవర్లలో ఆలౌట్) 253
వికెట్ల పతనం: 1-59, 2-114, 3-123, 4-136, 5-159, 6-172, 7-182, 8-229, 9-234
బౌలింగ్: బుమ్రా 15.5-5-45-6; ముకేశ్ 7-1-44-0; కుల్దీప్ 17-1-71-3; అశ్విన్ 12-0-61-0; అక్షర్ 4-0-24-1
భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి బ్యాటింగ్ 15; రోహిత్ బ్యాటింగ్ 13; మొత్తం: (5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 28
బౌలింగ్: అండర్సన్ 2-0-6-0; బషీర్ 2-0-17-0; రెహాన్ 1-0-5-0
అందుకున్నాడు..: ఉదయం గంటన్నరలోనే భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మరో 19 ఓవర్లలో 60 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లపై ఆధిపత్యం చలాయిస్తూ జైస్వాల్ (ఓవర్నైట్ స్కోరు 179) సాగిపోయాడు. బషీర్ బౌలింగ్లో స్వీప్ షాట్లతో వరుసగా సిక్సర్, ఫోర్ రాబట్టిన అతను ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. కుల్దీప్ (8 నాటౌట్) సహకారంతో జైస్వాల్.. జట్టు స్కోరును 400 దాటిస్తాడేమో అనిపించింది. కానీ అసాధారణ ఇన్నింగ్స్ను అతను పేలవ షాట్తో ముగించాడు. ఫీల్డర్లు బౌండరీల దగ్గర ఉన్నారని తెలిసి కూడా అండర్సన్ బౌలింగ్లో బంతిని గాల్లోకి లేపి నిష్క్రమించాడు. ఆ కొద్దిసేపటికే జట్టు ఆలౌటైంది.
1
టెస్టుల్లో యశస్వికి ఇదే తొలి డబుల్ సెంచరీ. తన అరంగేట్ర టెస్టులో వెస్టిండీస్పై చేసిన 171 పరుగులే గత అత్యధిక స్కోరు.
4
టెస్టుల్లో ద్విశతకం చేసిన నాలుగో భారత లెఫ్ట్హ్యాండర్ జైస్వాల్. కాంబ్లి, గంగూలీ, గంభీర్ ముందున్నారు.
152
టెస్టుల్లో బుమ్రా వికెట్లు. అతి తక్కువ మ్యాచ్ (34)ల్లో 150 వికెట్ల మైలురాయి చేరుకున్న భారత పేసర్ అతనే. ప్రపంచ క్రికెట్లో వకార్ (27) మాత్రమే బుమ్రా కంటే ముందున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్