అతివల ధనాధన్
ధనాధన్ బ్యాటింగ్.. అద్భుతమైన బౌలింగ్.. కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు వీక్షించే సమయం ఆసన్నమైంది. అభిమానులను తమ ఆటతో అలరించేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. నేటి నుంచే మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్. ఐపీఎల్కు ముందే టీ20 కిక్కు షురూ!
నేటి నుంచే డబ్ల్యూపీఎల్ రెండో సీజన్
ట్రోఫీ కోసం అయిదు జట్ల పోరు
తొలి మ్యాచ్లో ముంబయితో దిల్లీ ఢీ
రాత్రి 8 నుంచి బెంగళూరు
ధనాధన్ బ్యాటింగ్.. అద్భుతమైన బౌలింగ్.. కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు వీక్షించే సమయం ఆసన్నమైంది. అభిమానులను తమ ఆటతో అలరించేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. నేటి నుంచే మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్. ఐపీఎల్కు ముందే టీ20 కిక్కు షురూ!
అయిదు జట్లు.. బరిలో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు.. అందరి లక్ష్యం ఒక్కటే.. అదే డబ్ల్యూపీఎల్ ట్రోఫీ. గతేడాది ఆరంభ సీజన్లో ఛాంపియన్గా నిలిచిన ముంబయి ఇండియన్స్, రన్నరప్ దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్తో శుక్రవారం రెండో సీజన్కు తెరలేవనుంది. స్టార్ క్రికెటర్లతో నిండిన ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే ఆస్కారముంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ కూడా సమరానికి సై అంటున్నాయి. మార్చి 17న జరిగే ఫైనల్లో విజేతగా నిలవడమే ధ్యేయంగా బరిలో దిగుతున్నాయి. హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, శిఖా పాండే, రేణుక సింగ్ లాంటి స్టార్లతో పాటు శ్రేయాంక పాటిల్, తితాస్ సాధు, మిన్ను మణి, పర్శవి లాంటి భారత యువ క్రికెటర్లూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మెగ్ లానింగ్, హేలీ మాథ్యూస్, ఎలీస్ పెర్రీ, సోఫీ డివైన్, అలీసా హీలీ, చమరి ఆటపట్టు, బెత్ మూనీ వంటి విదేశీ అగ్రశ్రేణి క్రికెటర్లూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి (దిల్లీ), త్రిష పూజిత, షబ్నం (గుజరాత్), సబ్బినేని మేఘన (బెంగళూరు), యషశ్రీ, అంజలి, గౌహర్ సుల్తానా (యూపీ) కూడా లీగ్లో ప్రాతినిథ్యం వహించబోతున్నారు.
రెండు నగరాల్లో..: గతేడాది డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ కేవలం ముంబయిలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లోనే జరిగిన సంగతి తెలిసిందే. అమ్మాయిల ఆటకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి రెండు నగరాల్లో మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి 11 మ్యాచ్లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఫైనల్ సహా చివరి 11 మ్యాచ్లకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తాయి. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో మ్యాచ్లు ప్రసారమవుతాయి.
బాలీవుడ్ హీరోలతో..: చిన్నస్వామి స్టేడియంలో జరిగే డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్ర, కార్తీక్ ఆర్యన్.. ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ వేడుకలు సాయంత్రం 6.30 గంటలకు మొదలవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్