ఎక్కడి నుంచి ఎక్కడిదాకా!
పదేళ్ల బాలుడు.. అమ్మానాన్నను వదిలి, ఉన్న ఊరును కాదని ముంబయి వచ్చేశాడు. క్రికెట్ అంటే ప్రేమ. ఆటే జీవితం. ఆ మహా నగరంలో రోడ్లపై తిరిగాడు. పడుకోవడానికి చోటు లేక.. మైదానంలోని టెంటు కింద నిద్రించాడు. పానీపూరీ అమ్మాడు.
ఫోర్త్ అంపైర్
పదేళ్ల బాలుడు.. అమ్మానాన్నను వదిలి, ఉన్న ఊరును కాదని ముంబయి వచ్చేశాడు. క్రికెట్ అంటే ప్రేమ. ఆటే జీవితం. ఆ మహా నగరంలో రోడ్లపై తిరిగాడు. పడుకోవడానికి చోటు లేక.. మైదానంలోని టెంటు కింద నిద్రించాడు. పానీపూరీ అమ్మాడు. అప్పుడే అనుకున్నాడు.. టీమ్ఇండియాకు ఆడాలని, ముంబయిలో ఇల్లు కొనాలని!
పుష్కర కాలం గడిచింది.. ఇప్పుడు భారత జట్టులో అతనో కీలక ఆటగాడు. టెస్టుల్లో వరుసగా ద్విశతకాలు బాదేస్తూ.. రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా ముంబయిలో అత్యంత విలాసవంతమైన ప్రదేశంలో రూ.5 కోట్లకు పైగా డబ్బుతో 5 పడక గదుల ఫ్లాట్ కొన్నాడు. అతడే.. యశస్వి జైస్వాల్. ఏమీ లేని స్థితి నుంచి ఇక్కడివరకూ చేరుకున్న అతని స్ఫూర్తి ప్రయాణం అందరికీ ఆదర్శం. అతనో వ్యక్తిత్వ వికాస పాఠం.
ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ఆ దిశగా కొన్ని రోజులు పని చేస్తారు. మహా అయితే కొన్ని నెలలు కష్టపడతారు. ఆశించిన ఫలితాలు కనిపించకుంటే తమ వల్ల కాదని ఎంతోమంది మధ్యలోనే వదిలేస్తారు. కొత్త ఏడాది రాగానే అది చేసేద్దాం.. ఇది నేర్చుకుందాం అనుకుంటారు. కానీ ఓ వారం తిరిగేసరికి మళ్లీ మొదటికే వస్తారు. కల కనడం కాదు దాన్ని అందుకోవడం ముఖ్యం. గమ్యాన్ని చేరేంతవరకూ విశ్రమించకపోవడం ప్రధానం. అలాంటివాళ్లనే విజేతలు అంటారు. అలాంటి ఓ విజేతే.. యశస్వి జైస్వాల్. బలమైన సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనడానికి నిఖార్సైన ఉదాహరణ అతను. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేంతవరకూ అలుపెరగని, భయమెరగని వీరుడు అతను. అతని జీవితం పూల పాన్పేమీ కాదు. అతని దారిలో ఎన్నో సవాళ్లు. కానీ ఒక్కో కారు మబ్బును దాటుకుంటూ మిరుమిట్లు గొలిపే భానుడిలా ప్రకాశిస్తున్నాడు. యశస్వి లాంటి నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు ఈ స్థాయికి రావడం చిన్న విషయం కానేకాదు. కష్టపడితే కల నిజం చేసుకోవచ్చని అతను చాటాడు. క్రికెట్ అనే కాదు ఏ రంగమైనా, వృత్తి ఏదైనా శక్తివంచన లేకుండా సాగితే విజయవంతం కాగలమని నిరూపించాడు.
ఆగిపోవద్దు: ఒక్క రోజులోనే ఏదీ మారిపోదు. అనుకున్న వెంటనే ఫలితం దక్కదు. నిరంతర ప్రయత్నం తప్పనిసరి. పోరాటం లేకపోతే గెలుపే లేదు. విజయం దక్కడం లేదని ఆగిపోతే ఏం సాధించలేం. అలా ఆగిపోయి ఉంటే ఇప్పుడు యశస్వి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అతనెన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఎన్నో అడ్డంకులు దాటాడు. క్రికెట్ ఆడతానంటే తల్లిదండ్రులు వద్దన్నారు. తండ్రి చేయి చేసుకున్నాడు. కానీ ఆటంటే ప్రాణం. అందుకే ఉత్తర్ప్రదేశ్ నుంచి కట్టుబట్టలతో పెద్దగా ఏమీ తెలియని వయసులోనే ముంబయికి వచ్చేశాడు. డబ్బులు లేక పస్తులున్నాడు. డెయిరీలో పనికి కుదిరినా.. ఆటపై ధ్యాసతో సరిగ్గా పని చేయడం లేదంటూ అతణ్ని వద్దన్నారు. ఎక్కడ ఉండాలో తెలియక ఆజాద్ మైదానంలోని టెంట్లో పడుకున్నాడు. అక్కడే పానీపూరీ అమ్మాడు. ఇలా ఎన్నో ప్రతికూలతలు. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. మూడేళ్ల పాటు ఇవే ఇబ్బందులు. కానీ సాధించాడు. అందుకు కారణం.. అతని ఓపిక, స్వీయ నమ్మకం. కష్టాలకు బెదరని తీరు. సవాళ్లకు ఎదురుగా నిలబడే ధైర్యం.
అవకాశం వదలొద్దు: అవకాశం ఎంతో విలువైంది. అది అందడమే కష్టం. అందినపుడు సద్వినియోగం చేసుకోకుంటే మొత్తంగా దారులు మూసుకుపోతాయి. యశస్వికి ఏ చిన్న అవకాశం వచ్చినా రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. దేశవాళీల్లో ముంబయి తరపున రాణించాడు. 17 ఏళ్లకే లిస్ట్- ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసి, ఆ ఘనత సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2020 అండర్-19 ప్రపంచకప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగుల (400) వీరుడు అతడే. దీంతో అదే ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అతణ్ని తీసుకుంది. ఆ జట్టు తరపున లీగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. నిరుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదాడు. ఇక టీమ్ఇండియాకు ఆడాలనే స్వప్నం 2023 వెస్టిండీస్ పర్యటనలో సాకారమైంది. టెస్టులతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అక్కడి పేస్ పిచ్లపై ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్లోనే 171 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో వరుసగా రెండు టెస్టుల్లో ద్విశతకాలు బాదాడు. ఇప్పటివరకూ 7 టెస్టుల్లో 71.75 సగటుతో 861 పరుగులు చేశాడు. 17 టీ20ల్లో 161.93 స్ట్రైక్రేట్తో 502 పరుగులు సాధించాడు.
అలసత్వం వద్దు: ఓ స్థాయికి వచ్చేశాక అలసత్వం మంచిది కాదు. ఆపైనే కెరీర్ను నిర్మించుకోవడం కీలకం. ఐపీఎల్లో సత్తాచాటిన ఎంతో మంది టీమ్ఇండియాలోకి వచ్చినా.. నిలకడ లేక మరుగున పడ్డారు. కానీ యశస్వి అలా కాదు. అతని కసి వేరు. నిరంతరం మెరుగవాలనే తపనతో సాగుతున్నాడు. మ్యాచ్ ఉన్నా లేకపోయినా సాధన కొనసాగిస్తాడు. ఒక షాట్ను పరిపూర్ణంగా ఆడేంతవరకూ ఎన్ని గంటలైనా సరే ప్రాక్టీస్ చేస్తాడు. ఆగిపోవడం, అలసి పోవడం అతనికి తెలియదు. అతని పరుగుల దాహం తీరనిది. అర్ధశతకాన్ని శతకంగా ఎలా మలచాలి? ద్విశతకం ఎలా సాధించాలి? అనే ధ్యేయంతోనే ఆడతాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో యశస్వి ఓ అరుదైన రకం. ఒక్కసారిగా వచ్చిన పేరు, డబ్బుతో పొగరు తలకెక్కించుకోకూడదు. ఇతర ఆకర్షణల జోలికీ వెళ్లకూడదు. ఒకప్పుడు వినోద్ కాంబ్లి, ఈ తరంలో పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఆరంభంలో సత్తాచాటి ఆ తర్వాత దారి తప్పారు. ఇప్పుడు యశస్వికి 22 ఏళ్లే. అతను స్థిరంగా నిలబడితే.. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు దాటి సాగితే మరో భారత సూపర్స్టార్ అవుతాడు. యశస్వి అంటే విజయవంతమైన అని అర్థం. యశస్వి ఇదే తపనతో, సంకల్పంతో సాగితే సార్థక నామధేయుడు అవుతాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా మారతాడు. యశస్వి ప్రేరణతో యువత తమ రంగాల్లో సాగితే.. అతనిలాగే విజేతలుగా నిలుస్తారనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ