ఇషాన్, అయ్యర్లపై వేటు!
రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ వేటు వేయనున్నట్లు సమాచారం. 2023-24 సీజన్ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి ఇషాన్, అయ్యర్లను తప్పించనున్నట్లు తెలుస్తోంది.
సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించే ప్రమాదం
దిల్లీ: రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ వేటు వేయనున్నట్లు సమాచారం. 2023-24 సీజన్ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి ఇషాన్, అయ్యర్లను తప్పించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ బాధ్యతలకు దూరంగా ఉన్న ఇషాన్, అయ్యర్ భిన్నమైన కారణాలతో రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఐపీఎల్ కోసం తన టెక్నిక్పై పని చేస్తున్నానని ఇషాన్ చెప్పగా.. వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు అయ్యర్ తెలిపాడు. అయితే ఇషాన్, అయ్యర్ వ్యవహార శైలి పట్ల సంతృప్తిగా లేని బీసీసీఐ వీరిద్దరికి సెంట్రల్ కాంట్రాక్టులు నిరాకరించాలని భావిస్తోందట. ‘‘అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 2023-24 సీజన్ కోసం ఆటగాళ్ల కేంద్ర కాంట్రాక్టు జాబితాను దాదాపు ఖరారు చేసింది. త్వరలోనే బీసీసీఐ ఆ జాబితాను ప్రకటించనుంది. కిషన్, అయ్యర్ను జాబితా నుంచి తప్పించే అవకాశముంది. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని ఇద్దరు ఆటగాళ్లు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే నిరుడు వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున సత్తాచాటిన ఆటగాళ్లలో ఒకడైన అయ్యర్ను రంజీ మ్యాచ్ ఆడలేదన్న కారణంతో పక్కనబెట్టకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2022-23 కాంట్రాక్టు ప్రకారం సి- కేటగిరిలో ఇషాన్ (ఏడాదికి రూ.1 కోటి), బి- కేటగిరిలో అయ్యర్ (రూ.3 కోట్లు) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?