ఆఖరి బంతికి సిక్స్
మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది.
ముంబయిని గెలిపించిన సజన
రాణించిన యాస్తిక, హర్మన్
బెంగళూరు: మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. మొదట దిల్లీ 171/5 స్కోరు చేసింది. అలీస్ క్యాప్సీ (75; 53 బంతుల్లో 8×4, 3×6) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యాస్తిక భాటియా (57; 45 బంతుల్లో 8×4, 2×6), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (55; 34 బంతుల్లో 7×4, 1×6) విజయంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో రెండో బంతికే మాథ్యూస్ హీలీ (0) వికెట్ పడినా... యాస్తిక నిలిచింది. మొదట నాట్ సీవర్ (19).. తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తోడుగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది. అర్ధసెంచరీతో తర్వాత యాస్తిక ఔటైనా.. హర్మన్ప్రీత్, అమేలియా (24)తో కలిసి ఎదురుదాడి చేసి ముంబయిలో ఆశలు రేపింది. కానీ అమేలియా పెవిలియన్ చేరడంతో ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే పూజ (1) వికెట్ను కూల్చిన క్యాప్సీ.. అయిదో బంతికి హర్మన్ప్రీత్ను కూడా ఔట్ చేయడంతో దిల్లీ విజయం ఖాయంగా కనిపించింది. కానీ ముంబయి గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సజన (6 నాటౌట్) సిక్స్ బాదేసి దిల్లీకి షాక్ ఇచ్చింది. మొదట దిల్లీ 3 పరుగులకే షెషాలీవర్మ (1) వికెట్ కోల్పోయినా.. జెమీమా(42), లానింగ్ (31)తో కలిసి అలీస్ క్యాప్సీ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టింది. మ్యాచ్కు ముందు లీగ్ ఆరంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
దిల్లీ క్యాపిటల్స్: 171/5 (అలీస్ క్యాప్సీ 75, జెమీమా రోడ్రిగ్స్ 42, మెగ్ లానింగ్ 31; నాట్ సీవర్ 2/33, అమేలియా కెర్ 2/43)
ముంబయి ఇండియన్స్: 173/6 (యాస్తిక 57, హర్మన్ప్రీత్ 55, అమేలియా కెర్ 24; అరుంధతి రెడ్డి 2/27, అలీస్ క్యాప్సీ 2/23)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం