సంక్షిప్త వార్తలు
పారా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు సుహాస్ యతిరాజ్, ప్రమోద్ భగత్, కృష్ణ సాగర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. ఎల్ఎల్-4 సింగిల్స్ సెమీస్లో యతిరాజ్ 21-16, 21-19తో లూకస్ మజుర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
ఫైనల్లో యతిరాజ్, ప్రమోద్
పటాయా (థాయ్లాండ్): పారా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు సుహాస్ యతిరాజ్, ప్రమోద్ భగత్, కృష్ణ సాగర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. ఎల్ఎల్-4 సింగిల్స్ సెమీస్లో యతిరాజ్ 21-16, 21-19తో లూకస్ మజుర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. ఈ టోర్నీలో తుదిపోరు చేరడం అతడికిదే తొలిసారి. ఎస్ఎల్-3 సింగిల్స్ సెమీస్లో ప్రమోద్ భగత్ 23-21, 20-22, 21-18తో డానియల్ బేతెల్ (ఇంగ్లాండ్)పై కష్టపడి నెగ్గాడు. ఎస్హెచ్-6 సింగిల్స్ సెమీస్లో కృష్ణ సాగర్ 21-16, 21-17తో విక్టర్ టవారెస్ (బ్రెజిల్)ను ఓడించాడు. మహిళల ఎస్యూ-5 కేటగిరిలో మనీషా రాందాస్ ఫైనల్ చేరింది. సెమీస్లో 19-21, 21-19, 21-14తో మాద్ లెఫోర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గింది. ఎస్హెచ్-6 మహిళల డబుల్స్లో రచన-నిత్యశ్రీ కూడా తుదిపోరు చేరారు. నిత్యశ్రీ (ఎస్హెచ్-6), పలక్ కోహ్లి (ఎస్ఎల్-4), మనీషా రాందాస్ (ఎల్ఎల్-3) సింగిల్స్ సెమీస్లో ఓడి కాంస్యాలతో సంతృప్తిపడ్డారు.
హర్షితకు రజతం
దిల్లీ: ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ అమ్మాయి హర్షిత జక్కర్ రజతం గెలుచుకుంది. శనివారం జూనియర్ మహిళల వ్యక్తిగత పర్స్యూట్ కేటగిరిలో హర్షిత 2 నిమిషాల 32.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు పారా విభాగంలో భారత సైక్లిస్ట్లు సత్తా చాటారు. మహిళల కేటగిరిలో జ్యోతి గడెరియా (5 నిమిషాల 19.88 సె) స్వర్ణం గెలుచుకోగా.. పురుషుల వ్యక్తిగత పర్స్యూట్లో అర్షద్ షేక్ స్వర్ణం, ఆర్యవర్దన్ రజతం సొంతం చేసుకున్నారు.
భారత్కు నాలుగు పతకాలు
బాగ్దాద్: ఆసియా కప్ ఆర్చరీ లెగ్ 1లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. కాంపౌండ్ విభాగంలో మూడు స్వర్ణాలు సహా భారత్కు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చర్లు మరో పది పతకాలు ఖాయం చేశారు. కాంపౌండ్లో పురుషులు (ప్రథమేశ్, ప్రియాంశ్, కుశాల్), మహిళలు (అదితి, ప్రియ, ప్రణీత్ కౌర్), మిక్స్డ్ కాంపౌండ్ (ప్రథమేశ్-అదితి) జట్లు స్వర్ణాలు గెలిచాయి. మూడు జట్లూ ఫైనల్లో ఇరాన్ జట్లను ఓడించాయి. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఛాంపియన్ అదితి స్వామి కాంస్యం గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దీపిక కుమారితో సిమ్రన్జీత్, పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో తరుణ్దీప్ రాయ్తో ధీరజ్ బొమ్మదేవర తలపడతారు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్లో కుశాల్ దలాల్, ప్రథమేశ్ స్వర్ణం కోసం పోటీపడతారు.
షూటౌట్లో భారత్ ఓటమి
రవూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో శనివారం భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో పెనాల్టీ షూటౌట్లో 0-3తో ఓటమి పాలైంది. నిర్ణీత సమయంలో 2-2తో స్కోరు సమమైంది. 20వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ప్రీత్, 29వ నిమిషంలో అమిత్ రోహిదాస్ గోల్స్ కొట్టారు. ఆసీస్కు గోవర్స్ బ్లేక్ 25వ నిమిషంలో తొలి గోల్ కొట్టాడు. 53వ నిమిషంలో టామ్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. మ్యాచ్ షూటౌట్కు మళ్లింది. అందులో బ్రాండ్, ఒగిల్వీ, టామ్ వరుసగా గోల్స్ కొట్టగా.. భారత్ తరఫున ఆకాశ్దీప్, సుఖ్జీత్, లలిత్ కుమార్ విఫలమవడంతో మ్యాచ్ ఆసీస్ సొంతమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్