హకీ ఇండియాకు ఎలెనా రాజీనామా
సుదీర్ఘ కాలం హాకీ ఇండియాకు సేవలందించిన సీఈవో ఎలెనా నార్మన్ రాజీనామా చేసింది. హాకీ ఇండియా చాలాకాలంగా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని.. గ్రూపు రాజకీయాలు ఉన్న చోటు తాను కొనసాగలేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది.
దిల్లీ: సుదీర్ఘ కాలం హాకీ ఇండియాకు సేవలందించిన సీఈవో ఎలెనా నార్మన్ రాజీనామా చేసింది. హాకీ ఇండియా చాలాకాలంగా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని.. గ్రూపు రాజకీయాలు ఉన్న చోటు తాను కొనసాగలేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన 49 ఏళ్ల ఎలెనా 2011లో సీఈవోగా నియమితురాలైంది. 13 ఏళ్లు ఈ పదవిలో కొనసాగింది. ‘‘డబ్బులు చెల్లించే విషయంలో హాకీ ఇండియాతో ఇబ్బంది పడ్డా. అడగ్గా అడగ్గా గత వారం బకాయిలు విడుదల చేశారు. సంఘం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల ఫలితాలు రాబట్టలేం’’ అని ఎలెనా తెలిపింది. ఆమె రాజీనామాను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఆమోదించాడు. ఎలెనా సీఈవోగా ఉన్న కాలంలో భారత పురుషులు, మహిళల జట్లు ఉత్తమ ర్యాంకులు సాధించాయి. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల జట్టు చరిత్రాత్మక కాంస్యం గెలవగా.. అమ్మాయిలు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె హయాంలోనే 2018, 2023 ప్రపంచకప్లకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 36 ఏళ్ల విరామం తర్వాత భారత మహిళల జట్టు 2016లో రియో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో ఎలెనాది కీలకపాత్ర.
వాగ్నర్ వీడ్కోలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల ఈ లెఫ్ట్ఆర్మ్ పేసర్ కివీస్ తరఫున 64 టెస్టులు ఆడాడు. 37 సగటుతో 260 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో పుట్టి కివీస్కు ప్రాతినిథ్యం వహించిన వాగ్నర్.. 2012లో వెస్టిండీస్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై ఆఖరి మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కివీస్ విజయాల్లో వాగ్నర్ది కీలకపాత్ర. 2022 టెస్టు ఛాంపియన్షిప్ అందులో ముఖ్యమైంది. వాగ్నర్ ఆడిన 64 టెస్టుల్లో కివీస్ 34 గెలిచింది. గతేడాది ఇంగ్లాండ్పై కేవలం ఒకే పరుగు తేడాతో న్యూజిలాండ్ గెలవడం వెనుక వాగ్నర్ (4/62) కీలకమయ్యాడు. అండర్సన్ రూపంలో చివరి వికెట్ పడగొట్టి సంచలన విజయాన్ని అందించాడు. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నా.. అతడు సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రమే ఆడడం విశేషం.
బెయిర్స్టో రాణిస్తాడు: మెక్కలమ్
దిల్లీ: భారత్తో టెస్టు సిరీస్లో ఇప్పటిదాకా అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయినా.. వందో టెస్టులో జానీ బెయిర్స్టో సత్తా చాటుతాడని ఆశిస్తున్నట్లు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ చెప్పాడు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో బెయిర్స్టో అత్యధిక స్కోరు 38 మాత్రమే. సిరీస్లో ఆఖరిదైన అయిదో టెస్టు (ధర్మశాల)లో అతడికి పరీక్ష ఎదురు కానుంది. జానీ కెరీర్లో ఇది వందో మ్యాచ్. ‘‘జానీ బెయిర్స్టోది సహజంగా ఉద్వేగంగా ఉండే వ్యక్తిత్వం. ధర్మశాల టెస్టు అతడి కెరీర్లో పెద్ద మైలురాయి. ఈ వందో మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అతడు సత్తా చాటుతాడని ఆశిస్తున్నా’’ అని మెక్కలమ్ తెలిపాడు. రాంచి టెస్టులో విఫలం కావడం పేసర్ ఒలీ రాబిన్సన్ను బాగా బాధించిందని.. కానీ ఏ ఆటగాడికైనా వైఫల్యం మామూలేనని బ్రెండన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్