స్మృతి, మేఘన మెరుపులు
మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీదుంది. ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బంతితో సోఫీ మోలనూ (3/25), రేణుక సింగ్ (2/15) విజృంభించగా..
రాణించిన మోలనూ, రేణుక
ఆర్సీబీకి రెండో విజయం
బెంగళూరు
బెంగళూరు: మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీదుంది. ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బంతితో సోఫీ మోలనూ (3/25), రేణుక సింగ్ (2/15) విజృంభించగా.. ఆపై కెప్టెన్ స్మృతి మంధాన (43; 27 బంతుల్లో 8×4, 1×6), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (36 నాటౌట్; 28 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించడంతో మంగళవారం ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 107/7కే పరిమితమైంది. మోలనూ, రేణుక ప్రత్యర్థిని కట్టడి చేశారు. హేమలత (31 నాటౌట్) టాప్ స్కోరర్. ఛేదనలో దూకుడుగా ఆడిన స్మృతి.. బెంగళూరు విజయానికి బాటలు వేసింది. తొలి వికెట్కు సోఫీ డివైన్ (6)తో కలిసి 3.2 ఓవర్లలోనే 32 పరుగులు జత చేసిన ఈ స్టార్ ఓపెనర్.. ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత మేఘనతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లింది. మంధాన-మేఘన రెండో వికెట్కు 40 పరుగులు జత చేశారు. స్మృతి వెనుదిరిగినా.. ఎలీస్ పెర్రీ (23 నాటౌట్)తో కలిసి మేఘన పని పూర్తి చేసింది. ఆర్సీబీ 12.3 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుజరాత్కు ఇది వరుసగా రెండో ఓటమి.
గుజరాత్కు కళ్లెం: అంతకుముందు గుజరాత్కు ఆర్సీబీ బౌలర్లు కళ్లెం వేశారు. ఆరంభంలో రేణుక.. మధ్యలో మోలనూ విజృంభించడంతో ఆ జట్టు బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు చేయలేకపోయారు. ఒక దశలో ఆ జట్టు 10.1 ఓవర్లకు 45/2తో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (22), హేమలత ప్రత్యర్థి బౌలర్లను అడ్డుకున్నారు. హర్లీన్ వెనుదిరిగినా.. ఆఖరిదాకా నిలిచిన హేమలత గుజరాత్ స్కోరును 100 దాటించింది.
గుజరాత్: 107/7 (హేమలత 31 నాటౌట్, సోఫీ మోలనూ 3/25, రేణుక సింగ్ 2/14)
బెంగళూరు: 12.3 ఓవర్లలో 110/2 (స్మృతి మంధాన 43, మేఘన 36 నాటౌట్, ఎలీస్ పెర్రీ 23 నాటౌట్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..