ఇషాన్, శ్రేయస్ఔట్
అనుకున్నదే అయింది. టీమ్ఇండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై వేటుపడింది. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
పుజారా, ధావన్లకూ దక్కని బీసీసీఐ కాంట్రాక్టులు
ఎ+లో విరాట్, రోహిత్, బుమ్రా, జడేజా
దిల్లీ
అనుకున్నదే అయింది. టీమ్ఇండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై వేటుపడింది. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. బుధవారం 2023-24 సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుంచి ఇషాన్, అయ్యర్లను తప్పించడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లకు బీసీసీఐ గట్టి హెచ్చరిక జారీ చేసింది. భారత జట్టుకు అందుబాటులో లేని సమయంలో రంజీ ట్రోఫీలో ఆడాలన్న సూచనను పట్టించుకోకపోవడంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ కాంట్రాక్టుల జాబితా నుంచి తప్పించారు. ‘‘ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు కోసం చేసిన సిఫార్సులో శ్రేయస్, ఇషాన్లను పరిగణలోకి తీసుకోలేదు. భారత్కు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటగాళ్లందరికీ బోర్డు సూచించింది’’ అని బీసీసీఐ పేర్కొంది. టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారాకు సైతం సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. భారత టెస్టు జట్టులో తిరిగి చోటు సంపాదించాలన్న అతని ఆశలకు బోర్డు నిర్ణయంతో తెరపడినట్లే కనిపిస్తోంది. అతను దాదాపు తొమ్మిది నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. చాన్నాళ్లుగా భారత జట్టులో లేని శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, చాహల్లను కూడా బోర్డు పక్కనబెట్టింది. అయితే భారత జట్టులోకి తిరిగొచ్చే ఆటగాళ్లకు వచ్చే ఏడాది కాంట్రాక్టు పునరుద్ధరించే అవకాశముంది.
ఇది గట్టి హెచ్చరికే..
టీమ్ఇండియాకు ఆడి కొంచెం పేరు సంపాదిస్తే చాలు.. ఇక దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిన అవసరం లేదన్న భావన యువ క్రికెటర్లలో పెరిగిపోతున్న నేపథ్యంలో.. బీసీసీఐ కొరడా ఝులిపించడానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో పాల్గొనడం దశాబ్దాల కిందటే ఆగిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్లకు తోడు ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లపై పనిభారం పెరిగిపోతున్న నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో భారత్కు ఆడుతున్న స్టార్ ఆటగాళ్లు రంజీల్లో ఆడటం కష్టమే. కానీ ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుకుంటున్న యువ ఆటగాళ్లు కూడా రంజీలను విస్మరిస్తుండడం, భారత జట్టుకు ఆడకుండా ఖాళీగా ఉన్న సమయంలోనూ ఈ టోర్నీల వైపు చూడకపోవడం బీసీసీఐ ఆగ్రహం తెప్పించింది. బోర్డులో ఈ విషయమై కదలిక రావడానికి ప్రధాన కారణం.. ఇషాన్ కిషన్. అతను వ్యక్తిగత కారణాలతో అర్ధంతరంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చేశాడు. తుది జట్టులో చోటివ్వకుండా పక్కన పెట్టడంతో కినుక వహించి అతను స్వదేశానికి వచ్చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇషాన్ తీరు నచ్చక ఇంగ్లాండ్తో సిరీస్కు కూడా సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత రంజీల్లో ఆడాలని ఇషాన్కు, ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన శ్రేయస్కు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినా వాళ్లు పెడచెవిన పెట్టారు! ఝార్ఖండ్ రంజీ జట్టుకు తన అవసరం ఉన్నప్పటికీ ఇషాన్ అది పట్టించుకోకుండా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి సాధన చేయడం బీసీసీఐ ఆగ్రహాన్ని మరింత పెంచింది. శ్రేయస్ రంజీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ ఇషాన్తో పాటు అతడికీ గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టుల జాబితా నుంచి బీసీసీఐ తప్పించినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ పట్ల నిర్లక్ష్యం వహించే యువ ఆటగాళ్లందరికీ ఇది గట్టి హెచ్చరికగా పని చేస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
ఎవరు ఎందులో?
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా సెంట్రల్ కాంట్రాక్టులో ఎ+ గ్రేడ్లో తమ స్థానాల్ని నిలబెట్టుకున్నారు. ‘ఎ’ గ్రేడ్లో ఆర్.అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యకు చోటు దక్కింది. ‘బి’ గ్రేడ్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. రింకూ సింగ్, తిలక్వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ఖాన్, రజత్ పటీదార్లకు తొలిసారిగా బీసీసీఐ కాంట్రాక్టులు లభించాయి. వీరంతా ‘సి’ గ్రేడ్లో చోటు దక్కించుకున్నారు. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్ ‘సి’ గ్రేడ్లో కొనసాగుతున్నారు. గత ఏడాది ‘ఎ+’ఆటగాడికి ఏడాదికి రూ.7 కోట్లు బీసీసీఐ చెల్లించింది. ‘ఎ’ గ్రేడ్కు రూ.5 కోట్లు, ‘బి’ గ్రేడ్కు రూ.3 కోట్లు, ‘సి’ గ్రేడ్కు రూ.1 కోటి అందజేసింది. ఈ ఏడాది నుంచి ఆటగాళ్ల కాంట్రాక్టు మొత్తాన్ని బీసీసీఐ పెంచనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత