టైటిల్ పోరుకు పుణెరి, హరియాణా
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో ఫైనల్ జట్లేవో తేలిపోయాయి. టైటిల్ కోసం పుణెరి పల్టాన్తో హరియాణా స్టీలర్స్ ఢీకొట్టనుంది. పట్నా పైరేట్స్ను పుణెరి.. డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్ను హరియాణా ఓడించి ఆఖరి సమరానికి చేరాయి. బుధవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి 37-21తో పట్నాపై నెగ్గింది.
ఈనాడు - హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో ఫైనల్ జట్లేవో తేలిపోయాయి. టైటిల్ కోసం పుణెరి పల్టాన్తో హరియాణా స్టీలర్స్ ఢీకొట్టనుంది. పట్నా పైరేట్స్ను పుణెరి.. డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్ను హరియాణా ఓడించి ఆఖరి సమరానికి చేరాయి. బుధవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి 37-21తో పట్నాపై నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పుణెరి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లతో విరామ సమయానికి 20-11తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలోనూ పుణెరిదే జోరు. పట్నా కాస్త పుంజుకున్నా పట్టువదలని పుణెరి విజయాన్ని సొంతం చేసుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. అస్లామ్ (7), పంకజ్ (7), మహ్మద్రెజా (5) విజయంలో కీలకపాత్ర పోషించారు. పట్నా తరఫున సచిన్ (5), మంజీత్ (4), సుధాకర్ (4) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. మరో మ్యాచ్లో హరియాణా 31-27తో జైపుర్ను ఓడించింది. ఈ పోరులో రెండు జట్లు పోటాపోటీగా ఆడాయి. కానీ జోరు చూపించిన హరియాణా విరామానికి 19-13తో ఆధిక్యంలో నిలిచింది.. ద్వితీయార్థంలో జైపుర్ పుంజుకుంది. బలమైన డిఫెన్స్తో ప్రత్యర్థిని అడ్డుకోవడమే కాక.. అటాకింగ్ గేమ్తో పాయింట్లు సాధించింది. కానీ ఆఖర్లో తడబడి ఓటమి చవిచూసింది. వినయ్ (11) హరియాణా విజయంలో కీలకమయ్యాడు. శివమ్ (7) నుంచి అతడికి సహకారం అందింది. జైపుర్ జట్టులో అర్జున్ (14) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుక్రవారం గచ్చిబౌలిలోనే జరిగే తుది పోరులో పుణెరితో హరియాణా తలపడనుంది. సినీ నటుడు గోపీచంద్ సెమీస్ మ్యాచ్లకు హాజరై సందడి చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్