BCCI Central Contracts: కోహ్లి, రోహిత్ కూడా దేశవాళీలో ఆడాలి: కీర్తి ఆజాద్
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్శర్మ కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నాడు.
దిల్లీ: అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్శర్మ కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నాడు. అవకాశం ఉన్నా రంజీ బరిలో దిగకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ తప్పించిన నేపథ్యంలో అతడిలా పేర్కొన్నాడు. ‘‘కిషన్, శ్రేయస్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. ప్రతి ఒక్కరూ రంజీ క్రికెట్ ఆడాలి. కానీ ప్రస్తుతం ఐపీఎల్పైనే దృష్టి పెడుతున్నారు. ఐపీఎల్ వినోదాన్ని ఇస్తుందనేది వాస్తవం. కానీ సుదీర్ఘ ఫార్మాటే అసలైన క్రికెట్. ఒక ఆటగాడికి దేశానికి ఆడే అవకాశాన్ని అందించేది ఇదే. రోహిత్శర్మ, విరాట్ కోహ్లిలు సైతం ఖాళీ దొరికితే దేశవాళీ మ్యాచ్లు ఆడాలి. కిషన్, శ్రేయస్లపై మాత్రమే కొరడా ఝుళిపించడం తప్పు. నిబంధనలు మీరితే ఎవరిపైనైనా ఇలాంటి చర్యలే తీసుకోవాలి’’ అని ఆజాద్ అన్నాడు. ఇప్పుడు అందరి ప్రాధాన్యం టీ20లపైనే ఉందని.. ఒకప్పుడు స్టార్ ఆటగాళ్లంతా తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీల్లో ఆడేవాళ్లని ఆజాద్ చెప్పాడు. ‘‘ఒకప్పుడు మొహిందర్ అమర్నాథ్, బిషన్సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, సందీప్ పాటిల్ లాంటి వాళ్లు తరుచుగా దేశవాళీ మ్యాచ్లు ఆడేవాళ్లు. ప్రస్తుత తరం క్రికెటర్లు టీ20లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లు కౌంటీ బరిలో దిగుతారు. మరి భారత ఆటగాళ్లకు ఏమైంది?’’ అని ఆజాద్ ప్రశ్నించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే