కూల్గా వదిలేశాడు..
అయిదు టైటిళ్లు సాధించి పెట్టాడు..! పదిసార్లు జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు! ఎన్నో జ్ఞాపకాలను అందించాడు. మరెన్నో అనుభూతులను మిగిల్చాడు.చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది. అతడు ఐపీఎల్ చరిత్రలోనే మేటి కెప్టెన్.
చెన్నై సారథిగా వైదొలగిన ధోని
రుతురాజ్కు బాధ్యతలు
చెన్నై
అతడిది చెరగని ముద్ర..! అయిదు టైటిళ్లు సాధించి పెట్టాడు..! పదిసార్లు జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు! ఎన్నో జ్ఞాపకాలను అందించాడు. మరెన్నో అనుభూతులను మిగిల్చాడు.చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది. అతడు ఐపీఎల్ చరిత్రలోనే మేటి కెప్టెన్. కానీ అతడి ఆకర్షణీయ కెప్టెన్సీని ఇక చూడలేం. సారథిగా ఆ యోధుడి ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్గా ఎన్నో అపురూప విజయాలను సాధించి, చెన్నై సూపర్కింగ్స్ను ఛాంపియన్ జట్టుగా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోని.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యువ బ్యాటర్ రుతురాజ్కు సారథ్యాన్ని అప్పగించాడు. 2023 ఐపీఎల్ ఫైనలే సారథిగా మహేంద్రుడికి ఆఖరి మ్యాచ్.
‘కొత్త సీజన్లో కొత్త పాత్ర పోషించబోతున్నా’.. అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ధోని ఓ పోస్ట్ పెట్టడంతో ఆ పాత్ర ఏంటా అని అభిమానులంతా తెగ ఆలోచించారు. కానీ కెప్టెన్ కూల్ ఇలా షాకిస్తాడని మాత్రం ఊహించలేదు. చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్-17 ఆరంభానికి ఒక రోజు ముందు ధోని ప్రకటించాడు. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్కింగ్స్ కొత్త కెప్టెన్గా నియమితుడయ్యాడు. ‘‘ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై జట్టులో అంతర్భాగం. ఈ కాలంలో అతడు 52 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. వచ్చే ఐపీఎల్ సీజన్పై జట్టు ఆసక్తిగా ఉంది’’ అని సీఎస్కే గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ‘‘ధోని ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే చేస్తాడు. కెప్టెన్ల సమావేశానికి కొద్ది సేపటి ముందే నాకు ఈ విషయం తెలిసింది. అతడి నిర్ణయాన్ని గౌరవించాలి’’ అని సీఎస్కే ముఖ్య కార్యనిర్వహణ అధికారి కాశీ విశ్వనాథన్ చెప్పాడు. రుతురాజ్ నిరుటి ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 147.50 స్ట్రైక్రేట్తో 590 పరుగులు చేశాడు. అతడు కెప్టెన్సీకి కొత్తేమీ కాదు. నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ నాయకత్వం వహించాడు. తన రాష్ట్ర జట్టు మహారాష్ట్రను కూడా నడిపించాడు.
చెన్నైతో ధోనీది విడదీయరాని బంధం. ఆటగాడిగా నిష్క్రమించినా కూడా అతడు ఏదో ఒక పాత్రలో సీఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు. చెన్నై 2022లో కూడా నాయకత్వ మార్పిడికి ప్రయత్నించింది. కెప్టెన్గా జడేజా పేలవ ప్రదర్శన చేయడంతో ఎనిమిది మ్యాచ్ల తర్వాత తిరిగి ధోనీ చేతికే పగ్గాలు వచ్చాయి. ‘‘అప్పుడు మేం సఫలం కాలేకపోయాం. ఈసారి పరిస్థితులు వేరు’’ అని కాశీ విశ్వనాథన్ అన్నాడు. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్ మార్పిడికి మేం 2022లో సిద్ధంగా లేం. ధోనీకి ఆటపై అవగాహన చాలా ఎక్కువ. నాయకత్వం కోసం కుర్రాళ్లను సిద్ధం చేయాలనుకున్నాం. ఈసారి మాత్రం కెప్టెన్సీ మార్పిడికి సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పాడు. 42 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోని 135.91 స్ట్రైక్రేట్తో 5082 పరుగులు చేశాడు.
‘‘చెన్నైకి కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. అంతకుమించిన పెద్ద బాధ్యత. ప్రతిభావంతులతో కూడిన జట్టును నడిపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. జట్టులో ఎక్కువమంది అనుభవజ్ఞులే. ముఖ్యంగా నన్ను నడిపించేందుకు మహి భాయ్ ఉన్నాడు. జడ్డూ, రహానె కూడా ఉన్నారు. అందుకే దేని గురించి ఆందోళన చెందట్లేదు. కెప్టెన్సీని ఆస్వాదిస్తా’’
రుతురాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు