కూల్గా వదిలేశాడు..
అయిదు టైటిళ్లు సాధించి పెట్టాడు..! పదిసార్లు జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు! ఎన్నో జ్ఞాపకాలను అందించాడు. మరెన్నో అనుభూతులను మిగిల్చాడు.చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది. అతడు ఐపీఎల్ చరిత్రలోనే మేటి కెప్టెన్.
చెన్నై సారథిగా వైదొలగిన ధోని
రుతురాజ్కు బాధ్యతలు
చెన్నై
అతడిది చెరగని ముద్ర..! అయిదు టైటిళ్లు సాధించి పెట్టాడు..! పదిసార్లు జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు! ఎన్నో జ్ఞాపకాలను అందించాడు. మరెన్నో అనుభూతులను మిగిల్చాడు.చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది. అతడు ఐపీఎల్ చరిత్రలోనే మేటి కెప్టెన్. కానీ అతడి ఆకర్షణీయ కెప్టెన్సీని ఇక చూడలేం. సారథిగా ఆ యోధుడి ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్గా ఎన్నో అపురూప విజయాలను సాధించి, చెన్నై సూపర్కింగ్స్ను ఛాంపియన్ జట్టుగా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోని.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యువ బ్యాటర్ రుతురాజ్కు సారథ్యాన్ని అప్పగించాడు. 2023 ఐపీఎల్ ఫైనలే సారథిగా మహేంద్రుడికి ఆఖరి మ్యాచ్.
‘కొత్త సీజన్లో కొత్త పాత్ర పోషించబోతున్నా’.. అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ధోని ఓ పోస్ట్ పెట్టడంతో ఆ పాత్ర ఏంటా అని అభిమానులంతా తెగ ఆలోచించారు. కానీ కెప్టెన్ కూల్ ఇలా షాకిస్తాడని మాత్రం ఊహించలేదు. చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్-17 ఆరంభానికి ఒక రోజు ముందు ధోని ప్రకటించాడు. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్కింగ్స్ కొత్త కెప్టెన్గా నియమితుడయ్యాడు. ‘‘ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై జట్టులో అంతర్భాగం. ఈ కాలంలో అతడు 52 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. వచ్చే ఐపీఎల్ సీజన్పై జట్టు ఆసక్తిగా ఉంది’’ అని సీఎస్కే గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ‘‘ధోని ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే చేస్తాడు. కెప్టెన్ల సమావేశానికి కొద్ది సేపటి ముందే నాకు ఈ విషయం తెలిసింది. అతడి నిర్ణయాన్ని గౌరవించాలి’’ అని సీఎస్కే ముఖ్య కార్యనిర్వహణ అధికారి కాశీ విశ్వనాథన్ చెప్పాడు. రుతురాజ్ నిరుటి ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 147.50 స్ట్రైక్రేట్తో 590 పరుగులు చేశాడు. అతడు కెప్టెన్సీకి కొత్తేమీ కాదు. నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ నాయకత్వం వహించాడు. తన రాష్ట్ర జట్టు మహారాష్ట్రను కూడా నడిపించాడు.
చెన్నైతో ధోనీది విడదీయరాని బంధం. ఆటగాడిగా నిష్క్రమించినా కూడా అతడు ఏదో ఒక పాత్రలో సీఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు. చెన్నై 2022లో కూడా నాయకత్వ మార్పిడికి ప్రయత్నించింది. కెప్టెన్గా జడేజా పేలవ ప్రదర్శన చేయడంతో ఎనిమిది మ్యాచ్ల తర్వాత తిరిగి ధోనీ చేతికే పగ్గాలు వచ్చాయి. ‘‘అప్పుడు మేం సఫలం కాలేకపోయాం. ఈసారి పరిస్థితులు వేరు’’ అని కాశీ విశ్వనాథన్ అన్నాడు. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్ మార్పిడికి మేం 2022లో సిద్ధంగా లేం. ధోనీకి ఆటపై అవగాహన చాలా ఎక్కువ. నాయకత్వం కోసం కుర్రాళ్లను సిద్ధం చేయాలనుకున్నాం. ఈసారి మాత్రం కెప్టెన్సీ మార్పిడికి సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పాడు. 42 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోని 135.91 స్ట్రైక్రేట్తో 5082 పరుగులు చేశాడు.
‘‘చెన్నైకి కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. అంతకుమించిన పెద్ద బాధ్యత. ప్రతిభావంతులతో కూడిన జట్టును నడిపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. జట్టులో ఎక్కువమంది అనుభవజ్ఞులే. ముఖ్యంగా నన్ను నడిపించేందుకు మహి భాయ్ ఉన్నాడు. జడ్డూ, రహానె కూడా ఉన్నారు. అందుకే దేని గురించి ఆందోళన చెందట్లేదు. కెప్టెన్సీని ఆస్వాదిస్తా’’
రుతురాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్