ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ!
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! ఆరంభంలో కొన్ని సీజన్ల వరకు 130, 140 స్కోర్ల జట్టుగా ముద్రపడ్డ అదే సన్రైజర్స్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది. పదకొండేళ్ల కిందట క్రిస్ గేల్ (175 నాటౌట్) వీర విధ్వంసంతో 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసిన బెంగళూరు రికార్డును బుధవారం సన్రైజర్స్ తిరగరాసింది. ఏ రికార్డయినా ఏదో ఒక రోజు బద్దలవ్వాల్సిందే. కానీ పరుగుల వరద పారే ఐపీఎల్లో ఆర్సీబీ రికార్డు పదకొండేళ్ల పాటు పదిలంగా ఉండడం ఆశ్చర్యం! దాన్ని మళ్లీ బెంగళూరో లేదంటే ముంబయి లాంటి జట్టో బద్దలు కొడుతుందనే అంచనాలుండేవి. ఎందుకంటే ఆ జట్లే లీగ్లో భీకర బ్యాటింగ్కు ప్రసిద్ధి. కానీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్ రికార్డును సొంతం చేసుకుంది. నెమ్మదైన బ్యాటింగ్కు పేరుపడ్డ సన్రైజర్స్లో వార్నర్ కెప్టెన్ అయ్యాకే దూకుడు పెరిగింది. కానీ ఇప్పుడున్న దూకుడు మాత్రం అసాధారణం.
దక్షిణాఫ్రికా మెరుపు వీరుడు హెన్రిచ్ క్లాసెన్ రాకతో జట్టు బ్యాటింగ్ స్వరూపం మారింది. ఈ సీజన్కు ట్రావిస్ హెడ్ కూడా తోడయ్యాడు. తొలి మ్యాచ్లో అతణ్ని ఆడించకపోవడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు జట్టు యాజమాన్యానికి బాగానే అర్థమై ఉంటుంది. తానాడిన తొలి మ్యాచ్లోనే హెడ్ తనలోని విధ్వంసక కోణాన్ని బయటికి తీశాడు. క్రీజులోకి వచ్చీ రాగానే ముంబయి బౌలర్లపై విరుచుకుపడిపోయాడు. ట్రావిస్ దూకుడుకే తట్టుకోలేకపోతుంటే.. తర్వాత అభిషేక్ శర్మ వచ్చాడు. హెడ్ను మించి విధ్వంసం సృష్టించాడు. హెడ్ 18 బంతుల్లో అర్ధశతకం సాధించి సన్రైజర్స్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న బ్యాటర్గా నిలిస్తే.. కొన్ని నిమిషాల్లోనే ఆ రికార్డును అభిషేక్ (16 బంతుల్లో) బద్దలు కొట్టడం విశేషం. వీళ్లిద్దరూ ఔటైనా ముంబయికి ఉపశమనం లేకపోయింది. క్లాసెన్ రానే వచ్చాడు. ఈ సీజన్లో 11 సిక్సర్లు బాదాక కానీ క్లాసెన్ తొలి ఫోర్ కొట్టలేదంటే అతడికి సిక్స్ హిట్టింగ్ ఎంత సరదానో అర్థం చేసుకోవచ్చు. అతను ఊచకోతను మరో స్థాయికి తీసుకెళ్లి ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును సన్రైజర్స్ పేరుకు మార్చాడు. హైదరాబాద్ బ్యాటర్లు ఇదే దూకుడు కొనసాగిస్తే.. ఈ సీజన్లో ఆ జట్టు రాత మారబోతున్నట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి