క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది.
మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. ఈ భారత స్టార్ షట్లర్ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-12 తేడాతో హువాంగ్ యు సన్ (చైనీస్ తైపీ)ను చిత్తుచేసింది. మ్యాచ్ సాంతం ఆధిపత్యం ప్రదర్శించిన రెండో సీడ్ సింధు.. 36 నిమిషాల్లోనే వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి గేమ్లో ఒక దశలో అనవసర తప్పిదాలతో సింధు కాస్త వెనుకబడింది. అయితే 12 పాయింట్ల దగ్గర ప్రత్యర్థిని అందుకున్న ఆమె.. ఇక ఆ తర్వాత స్మాష్లతో అదరగొట్టింది. వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచింది. అదే ఊపులో తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. అలవోకగా ప్రత్యర్థిని ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ కథ ముగిసింది. అతను 18-21, 15-21తో క్వాలిఫయర్ తకహశి (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్రెడ్డి-సిక్కిరెడ్డి జంట క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది. సుమీత్-సిక్కి ద్వయం 22-20, 21-18తో ప్రెస్లీ స్మిత్-అలిసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అర్జున్-ధ్రువ్ కపిల జోడీ 21-17, 21-19తో క్రిస్టఫర్ గ్రిమ్లీ-మాథ్యూ గ్రిమ్లీ (స్కాట్లాండ్) జంటపై గెలవగా.. కృష్ణప్రసాద్-సాయిప్రతీక్ 16-21, 21-15, 16-21తో టోమా-క్రిస్టో (ఫ్రాన్స్) చేతిలో తలొంచారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో 21-14, 21-8తో టిఫానీ-గ్రోన్యా (ఆస్ట్రేలియా)పై నెగ్గి క్వార్టర్స్ చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు