క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది.
మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. ఈ భారత స్టార్ షట్లర్ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-12 తేడాతో హువాంగ్ యు సన్ (చైనీస్ తైపీ)ను చిత్తుచేసింది. మ్యాచ్ సాంతం ఆధిపత్యం ప్రదర్శించిన రెండో సీడ్ సింధు.. 36 నిమిషాల్లోనే వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి గేమ్లో ఒక దశలో అనవసర తప్పిదాలతో సింధు కాస్త వెనుకబడింది. అయితే 12 పాయింట్ల దగ్గర ప్రత్యర్థిని అందుకున్న ఆమె.. ఇక ఆ తర్వాత స్మాష్లతో అదరగొట్టింది. వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచింది. అదే ఊపులో తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. అలవోకగా ప్రత్యర్థిని ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ కథ ముగిసింది. అతను 18-21, 15-21తో క్వాలిఫయర్ తకహశి (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్రెడ్డి-సిక్కిరెడ్డి జంట క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది. సుమీత్-సిక్కి ద్వయం 22-20, 21-18తో ప్రెస్లీ స్మిత్-అలిసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అర్జున్-ధ్రువ్ కపిల జోడీ 21-17, 21-19తో క్రిస్టఫర్ గ్రిమ్లీ-మాథ్యూ గ్రిమ్లీ (స్కాట్లాండ్) జంటపై గెలవగా.. కృష్ణప్రసాద్-సాయిప్రతీక్ 16-21, 21-15, 16-21తో టోమా-క్రిస్టో (ఫ్రాన్స్) చేతిలో తలొంచారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో 21-14, 21-8తో టిఫానీ-గ్రోన్యా (ఆస్ట్రేలియా)పై నెగ్గి క్వార్టర్స్ చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!