పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు!
దిల్లీకి మళ్లీ తప్పని ఓటమి
ఆఖరి ఓవర్లో అవేష్ అదుర్స్
రాజస్థాన్కు వరుసగా రెండో విజయం
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! ఇక మ్యాచ్ రాజస్థాన్దే అనుకుంటుండగా.. మళ్లీ రేసులోకొచ్చింది దిల్లీ. చివరి ఓవర్లో 17 పరుగులు చేస్తే ఆ జట్టుదే విజయం. అంతకుముందు ఓవర్ల జోరు చూసి డీసీనే మ్యాచ్ గెలిచేస్తుందనుకుంటే.. అవేష్ ఖాన్ ఆఖరి ఓవర్లో మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్లో రియల్ హీరో మాత్రం మొదట సంచలన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగే. రాయల్స్ రెండో విజయం సాధించగా.. దిల్లీ మళ్లీ ఓడింది.
జైపుర్
ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో లఖ్నవూపై విజయం సాధించిన ఆ జట్టు.. గురువారం ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్ను 12 పరుగుల తేడాతో ఓడించింది. మొదట రియాన్ పరాగ్ (84 నాటౌట్; 45 బంతుల్లో 7×4 6×6) మెరుపులతో రాయల్స్ 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (1/24), అక్షర్ పటేల్ (1/21) ఆకట్టుకున్నారు. ఛేదనలో డేవిడ్ వార్నర్ (49; 34 బంతుల్లో 5×4, 3×6), ట్రిస్టియన్ స్టబ్స్ (44 నాటౌట్; 23 బంతుల్లో 2×4, 3×6) పోరాడినా దిల్లీని గెలిపించలేకపోయారు. ఆ జట్టు 173/5కు పరిమితమైంది. బర్గర్ (2/29), చాహల్ (2/19) డీసీకి బ్రేకులేశారు.
స్టబ్స్ ఆశలు రేపినా..: భారీ ఛేదనలో దిల్లీకి ఎలాంటి ఆరంభం కావాలో అలాంటిదే అందించారు మిచెల్ మార్ష్ (23; 12 బంతుల్లో 5×4), వార్నర్. మార్ష్ బౌండరీల మోత మోగించడంతో 3 ఓవర్లకు డీసీ 29/0తో నిలిచింది. కానీ ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తూ బర్గర్.. మార్ష్ను బౌల్డ్ చేశాడు. తర్వాతి బంతికే రికీ భుయ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే సమీక్షలో బయటపడ్డ భుయ్.. ఆ తర్వాతి బంతికే క్యాచౌట్తో వెనుదిరిగాడు. ఈ స్థితిలో పంత్ అండతో వార్నర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మార్ష్ బాధ్యతను తాను తీసుకుని వార్నర్ షాట్లు ఆడుతుంటే.. కుదురుకున్నాక పంత్ (28) సైతం బ్యాట్ ఝళిపించాడు. 11 ఓవర్లకు 93/2తో డీసీ పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ దశలో వార్నర్ను అవేష్, పంత్ను చాహల్ ఔట్ చేయడంతో దిల్లీకి కష్టాలు తప్పలేదు. పొదుపుగా బౌలింగ్ చేసిన చాహల్.. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (9)ను కూడా ఎక్కువసేపు నిలవనీయలేదు. 16 ఓవర్లకు స్కోరు 126/5. చివరి 4 ఓవర్లలో 60 పరుగులంటే దిల్లీ ఓటమి ఖాయమే అనిపించింది. కానీ ఐపీఎల్లో ఇప్పటిదాకా పెద్దగా రాణించని దక్షిణాఫ్రికా కుర్రాడు స్టబ్స్ అనూహ్యంగా చెలరేగాడు. అశ్విన్ వేసిన 17వ ఓవర్ చివరి రెండు బంతులకు సిక్సర్లు బాదిన స్టబ్స్.. ఆ తర్వాత కూడా భారీ షాట్లు ఆడడంతో చివరి ఓవర్లో డీసీ 17 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. అయితే గత మ్యాచ్లో లఖ్నవూకు చివరి ఓవర్లో 27 పరుగులు అవసరమైతే 11 పరుగులే ఇచ్చిన అవేష్.. ఈ మ్యాచ్లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఖరి ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. అతను స్టబ్స్, అక్షర్ (15 నాటౌట్)లకు షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు.
ఆ ఒక్కడు మార్చేశాడు..: ఈ మ్యాచ్ను రాజస్థాన్ ఆరంభించిన తీరు చూస్తే.. దిల్లీ ముందు 186 పరుగుల లక్ష్యం నిలుస్తుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. తొలి పది ఓవర్లలో ఆ జట్టు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దిల్లీ పేసర్లు ముకేశ్కుమార్, ఖలీల్ అహ్మద్.. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. రాయల్స్ బ్యాటర్లను కట్టిపడేశారు. ఇటు పరుగులూ రాక, అటు వికెట్లూ నిలవక రాయల్స్ ఇన్నింగ్స్లో సగ భాగం తీవ్రంగా ఇబ్బంది పడింది. దూకుడుకు మారుపేరైన యశస్వి (5), బట్లర్ (11) బ్యాట్లు ఝళిపించలేకపోయారు. యశస్విని ముకేశ్ బౌల్డ్ చేస్తే.. బట్లర్ను కుల్దీప్ వికెట్ల ముందు బలిగొన్నాడు. సంజు శాంసన్ (15) రెండు షాట్లు ఆడి.. ఖలీల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ జట్టు 50కి చేరుకోవడానికి 9.3 ఓవర్లు పట్టాయి. అయితే మూడో వికెట్ పడ్డాక హెట్మయర్ను కాదని అశ్విన్ను బ్యాటింగ్కు పంపగా.. అతను పరాగ్తో కలిసి ఇన్నింగ్స్కు మళ్లీ ఊపు తెచ్చాడు. అశ్విన్ బాదిన మూడు సిక్సర్లు మ్యాచ్లో హైలైట్. అయితే అశ్విన్ (29; 19 బంతుల్లో 3×6) ఆట ఇన్నింగ్స్ను కుదుటపరిస్తే.. మలుపు తిప్పింది మాత్రం రియాన్ పరాగే. నాలుగో స్థానంలో దిగి ఆరంభంలో కొంత ఆచితూచి ఆడిన అతను.. తర్వాత రెచ్చిపోయాడు. గత సీజన్లలో మాదిరి ఒకట్రెండు షాట్లు ఆడి ఔటైపోకుండా ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే పరాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అతను ఇంకా రెచ్చిపోయాడు. మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడి రాయల్స్కు ఊహించని స్కోరునందించాడు. ఖలీల్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టిన రియాన్.. చివరి ఓవర్లో (నోకియా) 4, 4, 6, 4, 4 బాదేశాడు. అశ్విన్ ఔటయ్యాక జురెల్ (20), హెట్మెయర్ (14 నాటౌట్)ల నుంచి అతడికి సహకారం లభించింది.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) ముకేశ్ 5; బట్లర్ ఎల్బీ (బి) కుల్దీప్ 11; శాంసన్ (సి) పంత్ (బి) ఖలీల్ 15; పరాగ్ నాటౌట్ 84; అశ్విన్ (సి) స్టబ్స్ (బి) అక్షర్ 29; జురెల్ (బి) నోకియా 20; హెట్మయర్ నాటౌట్ 14; ఎక్స్ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-9, 2-30, 3-36, 4-90, 5-142; బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-24-1; ముకేశ్ కుమార్ 4-0-49-1; నోకియా 4-0-48-1; అక్షర్ పటేల్ 4-0-21-1; కుల్దీప్ యాదవ్ 4-0-41-1
దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) సందీప్శర్మ (బి) అవేష్ 49; మిచెల్ మార్ష్ (బి) బర్గర్ 23; రికీభుయ్ (సి) శాంసన్ (బి) బర్గర్ 0; రిషబ్ పంత్ (సి) శాంసన్ (బి) చాహల్ 28; స్టబ్స్ నాటౌట్ 44; అభిషేక్ పొరెల్ (సి) బట్లర్ (బి) చాహల్ 9; అక్షర్ పటేల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-30, 2-30, 3-97, 4-105, 5-122; బౌలింగ్: బౌల్ట్ 3-0-29-0; బర్గర్ 3-0-29-2; అశ్విన్ 3-0-30-0; అవేష్ ఖాన్ 4-0-29-1; చాహల్ 3-0-19-2; సందీప్శర్మ 4-0-36-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి