పంత్ త్వరలోనే ప్రత్యేకంగా..
మధ్య ఓవర్లలో రిషబ్ పంత్ ఎలా ఆడతాడన్న దానిపై దిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆధారపడిందని ఆ జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ పేర్కొన్నాడు.
దిల్లీ బౌలింగ్ కోచ్
జైపుర్: మధ్య ఓవర్లలో రిషబ్ పంత్ ఎలా ఆడతాడన్న దానిపై దిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆధారపడిందని ఆ జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్ నుంచి ప్రత్యేకమైన ప్రదర్శనలను చూడబోతున్నామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2022 డిసెంబర్ చివర్లో రోడ్డు ప్రమాదం కారణంగా ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఈ ఐపీఎల్తోనే పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. తన కెప్టెన్సీలో దిల్లీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడింది. గురువారం రాజస్థాన్తో మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లోనూ ద్వితీయార్థంలో విఫలమై ఓటమి పాలైంది. ‘‘ఇన్నింగ్స్ చివర్లో ఆటను చక్కదిద్దుకోవాలి. అలాగే మధ్య ఓవర్లలో బ్యాటింగ్పైనా దృష్టి పెట్టాలి. ఆ దశలో క్రీజులో నిలబడాలి. ఈ సమస్యకు పరిష్కారం రిషబ్ పంత్ అని తెలుసు. సుదీర్ఘ విరామం తర్వాత అతను రెండు మ్యాచ్లాడాడు. రాబోయే కొన్ని వారాల్లో అతని నుంచి ప్రత్యేకమైన ప్రదర్శనలు చూస్తారనే ఆశిస్తున్నా’’ అని హోప్స్ చెప్పాడు. మరోవైపు గాయంతో ఆరు నెలలు విరామం తీసుకున్న పేసర్ నోకియా కూడా క్రమంగా పుంజుకుంటాడని హోప్స్ ధీమా వ్యక్తం చేశాడు. గత సెప్టెంబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న నోకియా.. ఈ ఐపీఎల్కు ముందు దేశవాళీల్లో మూడు టీ20లు మాత్రమే ఆడాడు. రాజస్థాన్తో మ్యాచ్లో పరాగ్ ధాటికి 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
-
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
-
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM