పోరాడి ఓడిన సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్లో దంపతులు సిక్కిరెడ్డి- సుమీత్ రెడ్డి సెమీస్ చేరారు.
సెమీస్లో సిక్కి జోడీ
మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్లో దంపతులు సిక్కిరెడ్డి- సుమీత్ రెడ్డి సెమీస్ చేరారు. మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. రెండో సీడ్ సింధు క్వార్టర్స్లో 26-24, 17-21, 20-22 తేడాతో ఆరో సీడ్ సుపనిద (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్లో 4-8తో వెనుకబడ్డ దశ నుంచి అద్భుత పోరాటంతో పుంజుకున్న సింధు హోరాహోరీ పోరులో పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి ఆమెకు కఠిన సవాలు ఎదురైంది. ఎవరూ తగ్గకపోవడంతో స్కోరు 24-24తో సమమైంది. ఆ దశలో వరుసగా రెండు పాయింట్లతో సింధు నెగ్గింది. కానీ రెండో గేమ్లో అనవసర తప్పిదాలతో ఆమె ఓడిపోయింది. మూడో గేమ్లో 10-5తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ సింధు అవకాశాన్ని చేజార్చుకుంది. చివరి వరకూ ప్రయత్నించినా.. ఆఖర్లో తప్పిదాలతో ఓటమి మూటగట్టుకుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో క్వార్టర్స్లో సిక్కి- సుమీత్ జోడీ 14-21, 21-11, 21-17 తేడాతో నాలుగో సీడ్ లీసా- రెహాన్ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. తొలి గేమ్లో ఓడినప్పటికీ సిక్కి ద్వయం గొప్పగా పుంజుకుంది. రెండో గేమ్ నుంచి అత్యుత్తమ ఆటతీరుతో సాగింది. స్మాష్లు, ర్యాలీలతో ఆకట్టుకుంది. 3-2తో ఆధిక్యంలో నిలిచిన తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఆధిపత్యం కొనసాగించి గేమ్ దక్కించుకుంది. మూడో గేమ్లో ఓ దశలో 5-10తో వెనకబడ్డప్పటికీ సిక్కి జోడీ పట్టు వదల్లేదు. 13-13తో ప్రత్యర్థిని అందుకున్న ఈ జంట అదే ఊపులో గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్లో మూడో సీడ్ తనీష- అశ్విని జంట 13-21, 19-21తో ఆరో సీడ్ లీ చియా- తెంగ్ చున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.