పరాగ్ పట్టుదలతో
ఆ యువ ఆటగాడు మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు.. నిలకడ లేదనే వ్యాఖ్యలు.. అంతర్జాలంలో దూషణలు.. ఇలా ఎంతో వ్యతిరేకత! కానీ ఆ కుర్రాడు కుంగిపోలేదు. పట్టుదలతో సాగుతున్నాడు.
దిల్లీ: ఆ యువ ఆటగాడు మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు.. నిలకడ లేదనే వ్యాఖ్యలు.. అంతర్జాలంలో దూషణలు.. ఇలా ఎంతో వ్యతిరేకత! కానీ ఆ కుర్రాడు కుంగిపోలేదు. పట్టుదలతో సాగుతున్నాడు. కసితో సత్తాచాటుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సరికొత్తగా అదరగొడుతున్నాడు. అతనే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్. ఈ సీజన్లో జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కీలక ఇన్నింగ్స్లతో విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడీ 22 ఏళ్ల అస్సాం కుర్రాడు. లఖ్నవూపై 29 బంతుల్లో 43 పరుగులు, దిల్లీపై 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ముఖ్యంగా దిల్లీతో మ్యాచ్లో 36/3తో కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. ఈ సీజన్లో అతను నాలుగో స్థానంలో వచ్చి రాణిస్తున్నాడు. 2019 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని పరాగ్పై విమర్శలు వచ్చాయి. అతని కోసం రాజస్థాన్ రూ.3.80 కోట్లు చెల్లించడం అనవసరమని సామాజిక మాధ్యమాల్లో ఎగతాళి చేశారు. ‘‘అభిమానులు నిన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారో తెలుసా?’’ అని సీజన్కు ముందు తండ్రి పరాగ్ దాస్ అడిగిన ప్రశ్నకు.. ‘‘నాపై అంచనాలున్నాయి. నేను విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పరుగులు చేయడం మొదలెడితే ఇకపై నా పేరే వినిపిస్తుంది’’ అని రియాన్ సమాధానమిచ్చాడు. ఇప్పుడు అతనదే చేస్తున్నాడు. ‘‘నేనెంతగానో చేసిన ప్రాక్టీస్కు ఫలితమిది. నేను కాస్త భావోద్వేగానికి గురవుతా. నా కష్టానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నా. భావోద్వేగాలను నియంత్రించుకుంటున్నా. నా ఇబ్బందులను చూసిన అమ్మ అండగా నిలుస్తోంది. ఏదేమైనా నాపై నాకున్న అభిప్రాయం మారదు. నా ప్రదర్శన ఎలా ఉన్నా నాకు నేను మద్దతుగానే ఉంటా’’ అని రియాన్ తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో రియాన్ను ఇష్టమొచ్చినట్లు ఎగతాళి చేయడం, విమర్శించడం, దూషించడం చాలా దారుణమని తండ్రి పరాగ్ చెప్పాడు. వాటన్నింటినీ అతను దాటాడని పేర్కొన్నాడు. మరోవైపు దేశవాళీల్లో సయ్యద్ ముస్తాక్ అలీ, దేవధర్ ట్రోఫీ, రంజీల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అదరగొట్టిన రియాన్కు రాజస్థాన్ కూడా మద్దతుగా నిలిచింది. ఈ సీజన్లో అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో పైకి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట