అంతా పసుపుమయం
అయిదేళ్ల తర్వాత విశాఖలో తొలి ఐపీఎల్ మ్యాచ్. ఇక్కడి వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని రెండు మ్యాచ్ల కోసం దిల్లీ క్యాపిటల్స్ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.
అయిదేళ్ల తర్వాత విశాఖలో తొలి ఐపీఎల్ మ్యాచ్. ఇక్కడి వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని రెండు మ్యాచ్ల కోసం దిల్లీ క్యాపిటల్స్ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ పేరుకే దిల్లీ సొంత మైదానం. సీఎస్కేతో పోరులో సందడంతా చెన్నై అభిమానులదే. స్టాండ్స్ మొత్తం పసుపు మయంగా మారిపోయింది. సాధారణంగానే సీఎస్కే మ్యాచ్లు ఎక్కడ జరిగినా ఆ జట్టు అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ధోనీకి ఇదే చివరి సీజన్ అనే ఊహాగానాల మధ్య అతణ్ని మైదానంలో చూసేందుకు అభిమానులు ఈసారి మరింతగా తరలివచ్చారు. ఇక చెన్నైకు దగ్గర్లోనే ఉన్న విశాఖలో మ్యాచ్ అనే సరికి అభిమాన సంద్రం పోటెత్తింది. నగరంలోనూ ఎక్కడ చూసినా చెన్నై అభిమానుల సందడే కనిపించింది. దీంతో ఇది తమకు సొంత మైదానంలో మ్యాచ్లా మారిపోయిందని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇన్స్టాగ్రామ్లోనూ సీఎస్కే కొత్త రికార్డు సృష్టించింది. 1.50 కోట్ల (15 మిలియన్) మంది అనుచరులను పొందిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (1.35 కోట్లు), ముంబయి ఇండియన్స్ (1.32 కోట్లు) ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం