సంక్షిప్త వార్తలు
ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీ మారనుంది. ఈనెల 17న శ్రీరామ నవమి ఉండటంతో ఆ రోజు జరిగే మ్యాచ్కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కు పోలీసులు తెలియజేశారు.
కోల్కతా-రాజస్థాన్ మ్యాచ్ తేదీ మార్పు!
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీ మారనుంది. ఈనెల 17న శ్రీరామ నవమి ఉండటంతో ఆ రోజు జరిగే మ్యాచ్కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కు పోలీసులు తెలియజేశారు. ‘‘మ్యాచ్ తేదీని మార్చాలని స్థానిక పోలీసులు విజ్ఞప్తి చేసినట్లు బీసీసీఐకి క్యాబ్ సమాచారం అందించింది. కొత్త తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నాడు.
పంత్కు రూ.12 లక్షల జరిమానా
విశాఖపట్నం: ఈ ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ బోణీతో సంతోషంలో ఉన్న కెప్టెన్ పంత్కు షాక్ తగిలింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి రూ.12 లక్షల జరిమానా పడింది. ‘‘సీఎస్కేతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా దిల్లీ కెప్టెన్ పంత్కు జరిమానా పడింది. ఈ సీజన్లో ఆ జట్టుకిదే తొలి తప్పిదం. కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్రేట్కు కనీస శిక్ష అయిన రూ.12 లక్షలు జరిమానాగా విధించాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో వరుసగా తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన దిల్లీ.. ఆదివారం విశాఖ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేను ఓడించిన సంగతి తెలిసిందే.
బ్యాటర్లు లయ అందుకుంటారు: ఫ్లవర్
బెంగళూరు: తమ టాప్ఆర్డర్ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో సత్తాచాటలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చీఫ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు. వీలైనంత త్వరగా బ్యాటర్లు లయను అందుకుంటారని ఫ్లవర్ ఆశాభావం వ్యక్తంజేశాడు. ‘‘అయిదుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇంకా చెలరేగలేదు. చిన్నస్వామి స్టేడియంలో పెద్ద స్కోర్లు రావాల్సి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు ఒక్కసారి పరుగులు రాబట్టడం మొదలుపెడితే భారీ స్కోర్లు చూడొచ్చు. అందులో నాకెలాంటి అనుమానం లేదు’’ అని ఫ్లవర్ తెలిపాడు. ఈ సీజన్లో సొంతగడ్డపై ఓడిన తొలి జట్టు ఆర్సీబీనే. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గత మ్యాచ్లో ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 17వ ఓవర్లోనే ఛేదించింది. మంగళవారం ఇదే వేదికలో బెంగళూరు.. లఖ్నవూను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్కు పిచ్ మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఫ్లవర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!