ధోని ఇంకాస్త ముందొస్తే..!
మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్కే ప్రత్యేక ఆకర్షణ ఈ దిగ్గజ ఆటగాడు. చెన్నై సూపర్ కింగ్స్ను అభిమానులు అంతలా ఆదరిస్తున్నారంటే.. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా స్టేడియం మొత్తం పసుపు మయంగా మారుతుందంటే అందుకు కారణం మహి! ఆటగాడిగా అతనికి ఇదే చివరి సీజన్ అని..
ఈనాడు - హైదరాబాద్
మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్కే ప్రత్యేక ఆకర్షణ ఈ దిగ్గజ ఆటగాడు. చెన్నై సూపర్ కింగ్స్ను అభిమానులు అంతలా ఆదరిస్తున్నారంటే.. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా స్టేడియం మొత్తం పసుపు మయంగా మారుతుందంటే అందుకు కారణం మహి! ఆటగాడిగా అతనికి ఇదే చివరి సీజన్ అని.. మళ్లీ ధోనీని మైదానంలో చూడలేమనే ఊహాగానాల నేపథ్యంలో చివరి సారిగా అతని బ్యాటింగ్ను చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. కానీ ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో ధోని అసలు క్రీజులోకే రాలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలోకి వెళ్లిపోయాడు. అయితే దిల్లీతో పోరులో మాత్రం అతను క్రీజులోకి రావాల్సిన అవసరం వచ్చింది. ఇలా వచ్చాడో లేదో అలా ధనాధన్ బ్యాటింగ్తో సత్తాచాటాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 37 పరుగులు చేశాడు. 42 ఏళ్ల వయసులో అతని మెరుపులతో స్టేడియం దద్దరిల్లింది. ఆ మ్యాచ్లో సీఎస్కే 20 పరుగుల తేడాతో ఓడటంతో.. ధోని ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు వచ్చి ఉంటే జట్టు గెలిచేదన్న చర్చ జరిగింది. అందుకే మిగతా మ్యాచ్ల్లోనైనా బ్యాటింగ్ ఆర్డర్లో ధోని మరింత పైన ఆడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్డర్లో కిందకు ఆడాలనేది ధోని నిర్ణయం లాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2019 జులైలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ధోని.. 2020 నుంచి ఐపీఎల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆ ఏడాది నుంచి ఈ సీజన్ ముందు వరకూ ఐపీఎల్లో వరుసగా 25, 16.28, 33.14, 26 సగటు మాత్రమే నమోదు చేశాడు. పైగా ఈ సారి సీఎస్కే కెప్టెన్సీని కూడా వదులుకున్న ధోని.. క్రమంగా జట్టుకు దూరమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిరుడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని.. దిల్లీతో మ్యాచ్ తర్వాత కాలికి పట్టీతో కనిపించాడు. వయసు, ఫిట్నెస్, ఫామ్.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే జట్టుకు భారంగా మారొద్దని అతను కిందకు వెళ్లిపోయాడని భావిస్తున్నారు. అంతే కాకుండా భవిష్యత్ దిశగా జట్టు నిర్మాణం కోసమూ అతను ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. సీఎస్కే బ్యాటింగ్ లోతు కూడా ఎక్కువే ఉంది. కానీ దిల్లీతో మ్యాచ్లో అతని బ్యాటింగ్ చూసిన తర్వాత ధోని జట్టుకు భారం కాదు.. ఇప్పటికీ గెలిపించే ఫినిషరే అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా అతను బౌండరీలు కొట్టిన తీరు ఒకప్పటి ధోనీని గుర్తుకుతెచ్చింది. నోకియా బౌలింగ్లో ఒంటిచేతి సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి లయతో ఉన్న ధోని.. ముందుగా బ్యాటింగ్ రావాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఆఖరి సారి అతని బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు.. అతని బాదుడు మాయలో పడిపోయేందుకు ఎదురు చూస్తున్నారు. మరి ధోని మనసులో ఏముందో? అతను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి వస్తాడా? లేదా అదే స్థానంలో కొనసాగుతాడా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు