దీపక్‌పై ఫుట్‌బాల్‌ సమాఖ్య వేటు

ఇద్దరు క్రీడాకారిణులపై భౌతిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సభ్యుడు దీపక్‌శర్మపై అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వేటు వేసింది.

Published : 03 Apr 2024 02:44 IST

దిల్లీ: ఇద్దరు క్రీడాకారిణులపై భౌతిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సభ్యుడు దీపక్‌శర్మపై అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వేటు వేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు దీపక్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రకటించింది. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌)లో పాల్గొనేందుకు గోవా వచ్చిన ఖాడ్‌ ఎఫ్‌సీ (హిమాచల్‌ ప్రదేశ్‌) క్రీడాకారిణులపై ఏఐఎఫ్‌ఎఫ్‌ ఈసీ సభ్యుడు, క్లబ్‌ యజమాని దీపక్‌ భౌతికంగా దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని