2019 ప్రపంచకప్ ఫైనల్లో పెద్ద తప్పు చేశా
2019 ప్రపంచకప్ ఫైనల్లో ఘోరమైన తప్పిదం చేసినట్లు ఇటీవలే రిటైరైన ఐసీసీ ఎలీట్ ప్యానెల్ మాజీ అంపైర్ మరియస్ ఎరాస్మస్ అన్నాడు. లార్డ్స్లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
లండన్: 2019 ప్రపంచకప్ ఫైనల్లో ఘోరమైన తప్పిదం చేసినట్లు ఇటీవలే రిటైరైన ఐసీసీ ఎలీట్ ప్యానెల్ మాజీ అంపైర్ మరియస్ ఎరాస్మస్ అన్నాడు. లార్డ్స్లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. వివాదాస్పద రీతిలో ముగిసిన ఫైనల్లో సూపర్ ఓవర్ తర్వాత కూడా స్కోర్లు సమమవడంతో బౌండరీ కౌంట్బ్యాక్ నిబంధన ప్రకారం ఇంగ్లాండ్ మొట్టమొదటి సారిగా ప్రపంచకప్ అందుకుంది. 50వ ఓవర్లో ఇంగ్లాండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన సమయంలో అంపైర్లు ఎరాస్మస్, కుమార ధర్మసేన ఓవర్ త్రో రూపంలో ఇంగ్లాండ్కు ఆరు పరుగులిచ్చారు. నిజానికి బ్యాటర్లు రెండో పరుగు పూర్తి చేయలేదు కాబట్టి ఓవర్ త్రో కింద అయిదు పరుగులే ఇవ్వాల్సింది. అదే జరిగితే మ్యాచ్ టై కాకపోయేది. న్యూజిలాండ్ గెలిచేది. ‘‘మర్నాడు ఉదయం హోటల్ గదుల నుంచి కుమార, నేను ఒకే సమయంలో బయటకి వచ్చాం. ‘మనం పెద్ద తప్పు చేశామని మీరు గమనించారా?’ అని కుమార అన్నాడు. అప్పుడే నాకు తెలిసింది. అయితే మైదానంలో ఉన్న ఆ క్షణంలో ఒకరికొకరం ‘ఆరు’ ‘ఆరు’ అని చెప్పుకొన్నాం. కానీ వాళ్లు రెండో పరుగు పూర్తి చేయలేదని గమనించలేకపోయాం’’ అని ఎరాస్మస్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్