ఇప్పుడు హైదరాబాద్ వంతు.. అంతా మహేంద్రుడి మయం
మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. భారత్కు రెండు ప్రపంచకప్లు అందించిన దిగ్గజ క్రికెటర్ బహుశా ఆఖరిసారి ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో అతడి ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.
టికెట్ల కోసం అభిమానుల పాట్లు
ఈనాడు, హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. భారత్కు రెండు ప్రపంచకప్లు అందించిన దిగ్గజ క్రికెటర్ బహుశా ఆఖరిసారి ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో అతడి ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ధోని ఏ నగరానికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొననుంది. అయిదేళ్ల తర్వాత ధోని హైదరాబాద్లో మ్యాచ్ ఆడుతుండటంతో ఈ మ్యాచ్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులకు ఐపీఎల్ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ధోని రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
చెన్నై మ్యాచ్ టికెట్ల కోసం పోటీని ముందే ఊహించిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ చాలా తక్కువ సంఖ్యలో ఆన్లైన్లో టికెట్లను అమ్మినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 40 వేల సామర్థ్యమున్న స్టేడియం టికెట్లు గంటలోనే అమ్ముడైనట్లు ఆన్లైన్ సంస్థ, ఫ్రాంచైజీ చెప్తున్నాయి. కానీ పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. వీటిని కాంప్లిమెంటరీ పాసులుగా ముద్రించి బ్లాక్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియం సమీపంలో బ్లాక్లో విక్రయిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ టికెట్ల వ్యవహారంపై మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు అమ్మారు? ఎవరు కొన్నారు? అనే వివరాలు ఆన్లైన్ సంస్థ, సన్రైజర్స్, హెచ్సీఏ దగ్గర ఉంటాయి. కానీ ఇప్పటి వరకు టికెట్ల విక్రయాల గురించి ఎవరూ ప్రకటన చేయలేదు.
ఇటీవల ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శులు, మిగతా ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు ప్రచారం కోసం పోటీపడ్డారు. పాఠశాలల చిన్నారులకు ప్రతిరోజూ ఉచితంగా 10 వేల పాసులు పంచినట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్కు వేల సంఖ్యలో కాంప్లిమెంటరీ పాసులు తీసుకుంటున్న హెచ్సీఏ.. విద్యార్థులకు పంచుతున్న దాఖలా లేదు. కనీసం డబ్బులు పెట్టి కొనేందుకైనా అవకాశం ఇవ్వడం లేదు? ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై, హైదరాబాద్లో ఎవరు గెలుస్తారు అన్న దానికంటే.. ధోని ఎలా ఆడతాడన్న దానిపైనే ఎక్కువ చర్చ సాగుతోంది. విశాఖపట్నంలో దిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ (37 నాటౌట్; 16 బంతుల్లో 4×4, 3×6) ఆడాడు. మరోసారి అతడి నుంచి అభిమానులు ధనాధన్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి