డోపింగ్లో పట్టుబడేలా చేస్తారేమో
తనను డోపింగ్లో పట్టుబడేలా చేసి ఒలింపిక్స్కు అర్హత సాధించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్కు అనుకూలంగా ఉండే వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
దిల్లీ: తనను డోపింగ్లో పట్టుబడేలా చేసి ఒలింపిక్స్కు అర్హత సాధించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్కు అనుకూలంగా ఉండే వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ‘‘నేను పారిస్ ఒలింపిక్స్ వెళ్లకుండా చేసేందుకు బ్రిజ్భూషణ్.. అతడి ప్రతినిధి సంజయ్సింగ్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టులో ఉన్న కోచ్లంతా బ్రిజ్భూషణ్కు అనుకూలంగా ఉండేవాళ్లే. మ్యాచ్ల సందర్భంగా నేను తాగే నీళ్లలో ఏదైనా నిషేధిత ఉత్ప్రేరకాన్ని కలిపి డోపింగ్లో పట్టుబడేలా చేసే అవకాశాలను కొట్టి పారేయలేం’’ అని వినేశ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కుట్రలో భాగంగానే ఏప్రిల్ 19న ఆరంభమయ్యే ఆసియా ఒలింపిక్ అర్హత టోర్నీకి తన వ్యక్తిగత కోచ్, ఫిజియోలకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. ‘‘ఆసియా ఒలింపిక్ అర్హత టోర్నీకి నా కోచ్, ఫిజియోకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సిందిగా గత నెల రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. గుర్తింపు కార్డులు లేకుండా వాళ్లు నాతో ఉండలేరు. కానీ కార్డులు ఇవ్వలేదు. దానికి సరైన కారణాన్ని వెల్లడించలేదు. ఇంకా ఏన్నాళ్లు ఇలా మానసికంగా వేధిస్తారు’’ అని వినేశ్ వాపోయింది. అయితే వినేశ్ ఆరోపణలను రెజ్లింగ్ సమాఖ్య వర్గాలు ఖండించాయి. ‘‘కోచ్, ఫిజియో గుర్తింపు కార్డుల గురించి వినేశ్ మార్చి 18న అడ్హాక్ కమిటీ, టాప్స్ సీఈవోకు ఈమెయిల్ పంపింది. అప్పటికే అదనపు సిబ్బంది వివరాల నమోదు పూర్తయిపోయింది. వినేశ్ కోచ్, ఫిజియో పేర్లను ఈ జాబితాలో చేర్చాల్సిందిగా సాయ్ నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. సాధారణంగా 10 మంది రెజ్లర్లకు ముగ్గురు చొప్పున కోచ్లను పంపుతాం. అలాంటిది ఆసియా రెజ్లింగ్ టోర్నీలో పాల్గొనే అయిదుగురు మహిళా రెజ్లర్లకు ఇప్పటికే ముగ్గురు కోచ్లు ఉన్నారు. మళ్లీ ఫొగాట్కు అదనపు కోచ్ ఎందుకు?’’ అని రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.