ధోనీపై ప్రేమ.. మాకెంతో ప్రయోజనం
అభిమానుల నుంచి ధోని పొందుతున్న ప్రేమతో చెన్నై సూపర్కింగ్స్ ప్రయోజనం పొందుతుందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో అతనెక్కడ మ్యాచ్ ఆడినా పసుపురంగుతో స్టేడియం నిండిపోతున్న సంగతి తెలిసిందే.
ముంబయి: అభిమానుల నుంచి ధోని పొందుతున్న ప్రేమతో చెన్నై సూపర్కింగ్స్ ప్రయోజనం పొందుతుందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో అతనెక్కడ మ్యాచ్ ఆడినా పసుపురంగుతో స్టేడియం నిండిపోతున్న సంగతి తెలిసిందే. ‘‘ఇదెంతో అద్భుతమైంది. ధోనీపై అభిమానుల ప్రేమ ఆశ్చర్యపరుస్తోంది. అతనిపై భారత్కు ఉన్న ప్రేమతో మేం లబ్ధి పొందుతున్నాం. ప్రత్యర్థి మైదానాల్లోనూ భారీ సంఖ్యలో పసుపు దళం స్టేడియాన్ని నింపేస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. హృదయం ఉప్పొంగిపోతోంది. ధోని పట్ల గర్వకారణంగా ఉంది. ప్రజలు అతనికి మద్దతుగా వస్తుండటం ధోనీకి దక్కుతున్న గౌరవానికి నిదర్శనం’’ అని ఫ్లెమింగ్ చెప్పాడు. రుతురాజ్ను కెప్టెన్ చేయాలన్నది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక కొన్నేళ్ల ఆలోచన ఉందని ఫ్లెమింగ్ వెల్లడించాడు. రుతురాజ్ స్ట్రైక్రేట్పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ఫ్లెమింగ్.. అతను కూడా ధోని లాంటి ఆటగాడేనని పేర్కొన్నాడు.
భారత్ ఎలా ఆడాలో నిర్ణయించుకోవాలి: మరోవైపు టీ20 ప్రపంచకప్కు ఆటగాళ్లను ఎంపిక చేసే ముందే ఆ టోర్నీలో ఎలాంటి శైలి ఆటతీరును ప్రదర్శించాలనే దానిపై భారత్ నిర్ణయం తీసుకోవాలని ఫ్లెమింగ్ సూచించాడు. ‘‘ప్రపంచకప్ సందర్భంగా వాళ్లు (టీమ్ఇండియా) ఎలాంటి ప్రణాళికతో ఆడాలని అనుకుంటున్నారన్నది ఇక్కడ ప్రశ్న. విదేశాల్లో తమకు సరైన ఆట విధానాన్ని వాళ్లు గుర్తించారా? అలాంటప్పుడు అందుకు అనుగుణంగా జట్టును ఎంచుకోవాలి. అంతే కానీ ఆటగాళ్లను తీసుకున్న తర్వాత ఆట ప్రణాళికను రూపొందించుకోకూడదు. దూబె శక్తిని ఇష్టపడతా. అలాంటి శక్తి కావాలంటే అతణ్ని కచ్చితంగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకుంటా’’ అని సమాధానమిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
-
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
-
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM