పోలీసుల రిమాండ్లో ఆసీస్ మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మైకెల్ స్లేటర్ను పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నారు. దాడి చేయడం, వెంబడించడం అభియోగాలతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు.
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మైకెల్ స్లేటర్ను పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నారు. దాడి చేయడం, వెంబడించడం అభియోగాలతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. గృహ హింస, వెంబడించడం, దాడి చేయడం, ఊపిరాడకుండా చేయడం, శరీరానికి హాని కలిగించడం, రాత్రి ఇంట్లో దూరడం ఇలా 54 ఏళ్ల స్లేటర్పై మొత్తం 19 అభియోగాలున్నాయి. మాజీ భార్యపై గృహ హింస, వెంబడించడం, హింసించడం తదితర ఆరోపణలతో 2021 అక్టోబర్లో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కూడా వివిధ కేసుల్లో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరిగి బెయిల్పై అతను బయటకొచ్చాడు. 2022లో పోలీసు అధికారిని వెంబడించి అతను మరోసారి అరెస్టయ్యాడు. నిరుడు నవంబర్లో పోలీసులతో వాగ్వాదం కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వివిధ ఆరోపణలతో పోలీసుల చేతికి చిక్కాడు. 1993 నుంచి 2003 మధ్యలో ఓపెనర్గా స్లేటర్ ఆసీస్ తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!