ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చేతి వేలికి గాయం కారణంగా సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు మ్యాక్స్వెల్ అందుబాటులో లేడని మొదట పేర్కొన్నారు. అయితే జట్టు నుంచి తానే తప్పుకొన్నట్లు మ్యాచ్ అనంతరం మ్యాక్స్వెల్ తెలిపాడు. ‘‘నాకిది చాలా తేలికైన నిర్ణయం. ముంబయి ఇండియన్స్తో మ్యాచ్ తర్వాత కెప్టెన్ డుప్లెసిస్, కోచ్ దగ్గరికి వెళ్లా. నా స్థానంలో మరొకరిని తీసుకునే సమయం వచ్చిందని చెప్పా. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకుని ఫిట్గా మారేందుకు ఇది మంచి సమయం. టోర్నీలో నా అవసరం వస్తే మానసికంగా, శారీరకంగా మరింత బలంగా తిరిగొచ్చి ప్రభావం చూపిస్తా. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. అలా ఆడుతూనే ఉంటే మరింత కిందకి వెళ్లిపోతాం. పవర్ ప్లే తర్వాత జట్టులో లోపం కనిపిస్తోంది. బ్యాటుతో జట్టుకు ఉపయోగపడలేకపోతున్నానని అనిపిస్తోంది. బెంగళూరుకు వస్తున్న ఫలితాలు, పాయింట్ల పట్టికలో స్థానం చూశాక మరొకరికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని భావించా’’ అని మ్యాక్స్వెల్ తెలిపాడు. 2019 అక్టోబరులో కూడా మ్యాక్స్వెల్ ఇలాంటి విరామమే తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లాడిన మ్యాక్స్వెల్ 5.33 సగటు, 94 స్ట్రైక్రేటుతో 32 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 28 పరుగులు ఒక్క మ్యాచ్లో చేసినవే. ఆరింట్లో మూడుసార్లు మ్యాక్స్వెల్ డకౌటయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!