ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
దిల్లీ: ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత ఆల్రౌండర్ల ఎదుగుదలను ఇది (ఇంపాక్ట్ ప్లేయర్) వెనక్కి లాగుతోందని నిజంగా భావిస్తున్నా. క్రికెట్ అనేది 11 మందితో ఆడేది. 12 మందితో కాదు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ విధానానికి నేనేమీ అభిమానిని కాదు. కొంతమందికి కాస్త వినోదం అందించడానికి ఆటలో ఇలా చేయడం సరికాదు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె లాంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. భారత జట్టుకు ఇది మంచిది కాదు. దీని గురించి ఏం చేస్తారో తెలియదు. కానీ ఇది నాకు నచ్చలేదు. 12 మంది ఆటగాళ్లు ఆడటంతో ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్ గమనాన్ని, పిచ్ ప్రవర్తనను బట్టి ఓ ఆటగాడి స్థానంలో మరొకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నారు. వికెట్లు కోల్పోకుండా మొదట బ్యాటింగ్ చేస్తే అప్పుడు అదనంగా మరో బౌలర్ను చేర్చుకుంటున్నారు. అప్పుడు ఆరేడుగురు బౌలర్లు జట్టులో ఉంటున్నారు. బ్యాటింగ్ మెరుగ్గా చేసే జట్లకు అదనపు బ్యాటర్ అవసరమే లేకుండా పోతోంది. ఏడెనిమిది స్థానాల్లోని ఆటగాళ్లు బ్యాటింగ్కు రావడం గగనమవుతోంది. 2008 నుంచి 2023 వరకు కేవలం రెండు సార్లు మాత్రమే ఓ ఇన్నింగ్స్లో 250కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఈ సారి ఇప్పటికే నాలుగు సార్లు 250 కంటే ఎక్కువగా పరుగులు జట్లు చేశాయి. ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా ఏడెనిమిది బ్యాటర్లు ఉంటున్నారు’’ అని ఓ యూట్యూబ్ షోలో మాజీ ఆటగాళ్లు మైకెల్ వాన్, గిల్క్రిస్ట్తో మాట్లాడుతూ రోహిత్ తెలిపాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా కూర్పుపై ఓ అంచనాకు వచ్చేందుకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్ను తాను కలిశానని వస్తున్న వార్తలను రోహిత్ కొట్టిపడేశాడు. ‘‘నేనెవరినీ కలవలేదు. అగార్కర్ దుబాయ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు. తన తనయుడి క్రికెట్ కోసం రాహుల్ ముంబయిలో ఉన్నాడు. మేం కలవలేదు. మేం కెమెరా ముందు మాట్లాడకుండా వచ్చే వార్తలన్నీ నకిలీవే’’ అని అతను తెలిపాడు. ఈ సీజన్లో ధోని, దినేశ్ కార్తీక్ గొప్పగా ఆడుతున్నారని, కానీ జట్టులోకి తిరిగొచ్చేలా ధోనీకి నచ్చజెప్పడం కష్టమని రోహిత్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికాకు ధోని వస్తాడు.. కానీ అది గోల్ఫ్ ఆడటం కోసమని రోహిత్ చెప్పాడు. పంత్ ఎంతో సరదాగా ఉంటాడని, ఎప్పుడూ నవ్విస్తుంటాడని హిట్మ్యాన్ వెల్లడించాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ భారం లేకపోవడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని రోహిత్ అన్నాడు.
పాక్తో టెస్టులకు సిద్ధమే: తటస్థ వేదికలో పాకిస్థాన్తో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇష్టపడతానని రోహిత్ తెలిపాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో ఈ దాయాది జట్లు ద్వైపాక్షిక సిరీస్లో ఆడాయి. ఇక టెస్టుల్లో అయితే ఆఖరి సారి 2007-08లో తలపడ్డాయి. ‘‘వాళ్ల (పాకిస్థాన్)ది మంచి జట్టు అని నమ్ముతున్నా. మంచి బౌలింగ్ లైనప్ ఉంది. ఆ జట్టుతో విదేశాల్లో తలపడితే పోరు గొప్పగా ఉంటుంది. ఆ జట్టుతో ఆడటాన్ని ఇష్టపడతా. మేం ఐసీసీ ట్రోఫీల్లోనే పాక్తో తలపడుతున్నాం. నాణ్యమైన క్రికెట్ పరంగా చూస్తే ఆ జట్టుతో ఆడేందుకు సిద్ధమే’’ అని రోహిత్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్