అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది!
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! అశుతోష్ శర్మ అనే ఓ కుర్రాడు ధనాధన్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఒంటిచేత్తో పంజాబ్ వైపు లాగేశాడు. శశాంక్ సింగ్తో కలిసి జట్టును గెలిపించాడు. ఎవరీ అశుతోష్ అనుకునేలోపే సన్రైజర్స్ హైదరాబాద్ (33 నాటౌట్)పై.. రాజస్థాన్ రాయల్స్ (31)పై మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ఇక ముంబయి ఇండియన్స్పై ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే! 111/7తో ఓటమి అంచున నిలిచిన జట్టును అద్భుతమైన బ్యాటింగ్తో పంజాబ్కు ఊపిరిపోశాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్లో కాళ్లను వంచి ఫైన్ లెగ్లో కొట్టిన సిక్సర్.. మధ్వాల్ బౌలింగ్లో ఆడిన రివర్స్ స్కూప్ హైలైట్. వికెట్లు పడినా ఏమాత్రం తొణక్కుండా అతడు ఆడిన షాట్లు అద్భుతం. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా.. అతడి పోరాటం అందరిని ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల అశుతోష్.. దేశవాళీ మ్యాచ్ల్లో హార్డ్ హిట్టర్గా పేరు పొందాడు. 2023 ముస్తాక్ అలీ టోర్నమెంట్లో 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి యువరాజ్సింగ్ (12) రికార్డును బద్దలుకొట్టాడు. ఈ ఏడాది వేలంలో రూ.20 లక్షలు వెచ్చించి ఈ కుర్రాడిని పంజాబ్ దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.