ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది.
అశుతోష్ అద్భుతంగా పోరాడినా కింగ్స్కు దక్కని విజయం
ఉత్కంఠపోరులో ముంబయిదే గెలుపు
విజృంభించిన బుమ్రా, కొయెట్జీ
ముల్లాన్పుర్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. నమ్మశక్యంతో కాని ఆటతో ప్రేక్షకులను ఉత్తేజితులను చేస్తూ ముంబయికి చెమటలు పట్టించింది. కళ్లు చెదిరే షాట్లతో సిక్సర్ల మోత మోగిస్తోన్న అశుతోష్ క్రీజులో ఉండగా.. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ సంచలన విజయం సాధించేలా కనిపించింది కూడా. కానీ ఆఖర్లో బంతితో పుంజుకున్న ముంబయి హమ్మయ్య అనుకుంది. అయితే విజయం ముంబయిదే అయినా.. తన చిరస్మరణీయ పోరాటంతో పంజాబ్ అభిమానుల మనసులను గెలుచుకుంది.
వారెవ్వా ఏం మ్యాచ్. ఏకపక్షమనుకున్న పోరు కాస్తా అభిమానులను ఉర్రూతలూగించింది. ఆఖరికి 9 పరుగుల తేడాతో గెలిచి ముంబయి ఇండియన్స్ ఊపిరిపీల్చుకుంది. సూర్యకుమార్ (78; 53 బంతుల్లో 7×4, 3×6) చెలరేగడంతో గురువారం మొదట ముంబయి 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36; 25 బంతుల్లో 2×4, 3×6), తిలక్ వర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా (3/21), కొయెట్జీ (3/32) ఆ జట్టును దెబ్బతీశారు. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2×4, 7×6) అద్భుత పోరాటపటిమను ప్రదర్శించాడు. శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2×4, 3×6) రాణించాడు.
అద్భుతం ఆ పోరాటం: 193 పరుగుల లక్ష్యం. మరీ పెద్ద లక్ష్యమేమీ కాదు. కానీ పంజాబ్ బ్యాటింగ్ ఘోరం! ఎంతగా అంటే.. మూడు ఓవర్లయినా కాకముందే ఆ జట్టు ఓటమి ముంగిట నిలిచింది. బుమ్రా, కొయెట్జీ పేస్కు హడలెత్తిన ఆ జట్టు 2.1 ఓవర్లలో 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో కొయెట్జీ.. ప్రభ్సిమ్రన్ను ఔట్ చేస్తే.. బుమ్రా రెండో ఓవర్లో రొసో (1), సామ్ కరన్ (6)ను వెనక్కి పంపాడు. కొయెట్జీ తిరిగి ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హార్డ్ హిట్టర్ లివింగ్స్టన్ను రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపి పంజాబ్ను చావు దెబ్బతీశాడు. ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్తో పాటు హర్ప్రీత్ సింగ్(13) నిలబడడంతో పవర్ప్లే ఆఖరికి 40/4తో నిలిచింది పంజాబ్. ఏడో ఓవర్లో హర్ప్రీత్ను గోపాల్ వెనక్కి పంపడంతో 49/5తో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది పంజాబ్ ఓటమి లాంఛనమేనని అనుకున్నారంతా! జట్టు స్కోరు 77 వద్ద జితేశ్ శర్మ కూడా ఔట్ కావడంతో జోరుమీదున్న శశాంక్కు తోడయ్యాడు అశుతోష్. అతడు వస్తూనే సిక్స్ల మోత మోగించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. శశాంక్, అశుతోష్ విధ్వంసక బ్యాటింగ్తో ఒక్కసారిగా ఆటను రసవత్తంగా మార్చారు. జోరు కొనసాగిస్తూ గోపాల్ బౌలింగ్లో శశాంక్ రెండు సిక్స్లు బాదాడు. ఏడో వికెట్కు 34 పరుగులు జోడించాక శశాంక్ ఔటైనా.. హర్ప్రీత్ బ్రార్ (21) సహాయంతో అశుతోష్ విధ్వంసాన్ని కొనసాగించడంతో ముంబయికి కంగారు తప్పలేదు. బుమ్రా యార్కర్ను స్లాగ్ స్వీప్తో అశుతోష్ సిక్స్గా మలిచిన తీరును చూసి తీరాల్సిందే. 16 ఓవర్లలో 165/7తో పంజాబ్ గెలుపుపై కన్నేసింది.
అతడి ఔట్తో మలుపు..: ఆఖరి నాలుగు ఓవర్లలో కేవలం 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ ఫేవరెట్గా మారిపోయింది. కానీ మ్యాచ్లో మళ్లీ మలుపు. బుమ్రాను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడడంతో 17వ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్ (కొయెట్జీ) తొలి బంతికే అశుతోష్ ఔట్ కావడంతో ముంబయి మళ్లీ పోటీలోకి వచ్చింది. ఆ ఓవర్లో రెండే పరుగులొచ్చాయి. ఉత్కంఠ పెరిగింది. క్రీజులో బ్రార్తో పాటు హర్షల్ పటేల్. 19వ ఓవర్లో 11 పరుగులిచ్చిన హార్దిక్.. బ్రార్ను ఔట్ చేశాడు. చేతిలో ఒక్క వికెట్టే ఉన్న పంజాబ్కు ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరయ్యాయి. తొలి బంతికి మధ్వాల్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతికి రబాడ రనౌట్ కావడంతో పంజాబ్ ఆశలకు తెరపడింది.
మెరిసిన సూర్య: ముంబయి ఇన్నింగ్స్లో సూర్య బ్యాటింగే హైలైట్. ఆఖర్లో తిలక్ కూడా విలువైన పరుగులు జోడించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి.. ఇషాన్ కిషన్ (8) వికెట్ను త్వరగానే కోల్పోయింది. మూడో ఓవర్లో రబాడ అతణ్ని ఔట్ చేశాడు. అయితే రోహిత్, సూర్య ఇన్నింగ్స్ను నడిపించారు. అర్ష్దీప్, సామ్ కరన్ బౌలింగ్లో రోహిత్ సిక్స్లు బాదాడు. సూర్య కూడా దూకుడైన ఆటతో చకచకా బౌండరీలు కొట్టాడు. పవర్ ప్లే ముగిసే సరికి ముంబయి స్కోరు 54/1. ఆ తర్వాత రోహిత్ దూకుడు తగ్గినా.. రబాడ, లివింగ్స్టన్ ఓవర్లలో సూర్య సిక్స్లు కొట్టడంతో ముంబయి 10 ఓవర్లలో 86/1తో నిలిచింది. అయితే ఆ జట్టు తర్వాతి నాలుగు ఓవర్లలో రోహిత్ వికెట్ను కోల్పోయి.. 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ను సామ్కరన్ ఔట్ చేశాడు. ఆ దశలో చెలరేగి ఆడిన తిలక్ ఇన్నింగ్స్కు మళ్లీ ఊపు తెచ్చాడు. అర్ష్దీప్ ఓవర్లో తిలక్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. సూర్య వరుసగా 4, 6.. తిలక్ ఓ సిక్స్ బాదడంతో ఓ ఓవర్లో రబాడ 16 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్కు కరన్ తెరదించినా.. తిలక్తో పాటు టిమ్ డేవిడ్ (14; 7 బంతుల్లో 2×4, 1×6) కాస్త బ్యాట్ ఝళిపించాడు. ఆఖరి ఆరు ఓవర్లలో ముంబయి 77 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు
ముంబయి ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) బ్రార్ (బి) రబాడ 8; రోహిత్ (సి) బ్రార్ (బి) కరన్ 36; సూర్యకుమార్ (సి) ప్రభ్సిమ్రన్ (బి) కరన్ 78; తిలక్ వర్మ నాటౌట్ 34; హార్దిక్ (సి) బ్రార్ (బి) హర్షల్ 10; టిమ్ డేవిడ్ (సి) కరన్ (బి) హర్షల్ 14; షెఫర్డ్ (సి) శశాంక్ సింగ్ (బి) హర్షల్ 1; నబి రనౌట్ 0; ఎక్స్ట్రాలు 11
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192;
వికెట్ల పతనం: 1-18, 2-99, 3-148, 4-167, 5-190, 6-192, 7-192;
బౌలింగ్: లివింగ్స్టన్ 2-0-16-0; అర్ష్దీప్ సింగ్ 3-0-35-0; రబాడ 4-0-42-1; హర్షల్ పటేల్ 4-0-31-3; సామ్ కరన్ 4-0-41-2; హర్ప్రీత్ బ్రార్ 3-0-21-0
పంజాబ్ ఇన్నింగ్స్: కరన్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 6; ప్రభ్సిమ్రన్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 0; రొసౌ (బి) బుమ్రా 1; లివింగ్స్టన్ (సి) అండ్ (బి) కొయెట్జీ 1; హర్ప్రీత్ సింగ్ (సి) అండ్ (బి) గోపాల్ 13; శశాంక్ సింగ్ (సి) తిలక్ (బి) బుమ్రా 41; జితేశ్శర్మ ఎల్బీ (బి) మధ్వాల్ 9; అశుతోష్ శర్మ (సి) నబి (బి) కొయెట్జీ 61; హర్ప్రీత్ బ్రార్ (సి) నబి (బి) పాండ్య 21; హర్షల్ పటేల్ నాటౌట్ 1; రబాడ రనౌట్ 8; ఎక్స్ట్రాలు 21
మొత్తం: (19.1 ఓవర్లలో ఆలౌట్) 183
వికెట్ల పతనం: 1-10, 2-13, 3-14, 4-14, 5-49, 6-77, 7-111, 8-168, 9-174;
బౌలింగ్: కొయెట్జీ 4-0-32-3; బుమ్రా 4-0-21-3; మధ్వాల్ 3.1-0-46-1; హార్దిక్ పాండ్య 4-0-33-1; శ్రేయస్ గోపాల్ 2-0-26-1; షెఫర్డ్ 2-0-20-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్