సన్డేంజర్స్
ఇది.. సన్రైజర్స్ జట్టేనా? బ్యాటింగ్లో తడబడుతూ.. బౌలింగ్పైనే ఆధారపడుతూ సాగిన జట్టు ఇదేనా? ఈ సీజన్లో సన్రైజర్స్కు ఏమైంది?
ఈనాడు క్రీడావిభాగం
ఇది.. సన్రైజర్స్ జట్టేనా? బ్యాటింగ్లో తడబడుతూ.. బౌలింగ్పైనే ఆధారపడుతూ సాగిన జట్టు ఇదేనా? ఈ సీజన్లో సన్రైజర్స్కు ఏమైంది? ఈ బాదుడేంటీ? ఒక మ్యాచ్లో అయితే అన్ని పరిస్థితులు కలిసొచ్చి, అద్భుతమైన బ్యాటింగ్తో రికార్డు సృష్టించిందని అనుకోవచ్చు. అదే రికార్డును మరో మ్యాచ్లో బద్దలు కొడితే ఔరా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవక తప్పదు. కానీ ప్రతి మ్యాచ్లోనూ అదే దూకుడు కొనసాగిస్తూ.. ప్రతి ఇన్నింగ్స్లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే ఏం చెప్పగలం? ఆ బ్యాటింగ్ను తనివితీరా చూస్తూ ఆస్వాదించడం తప్ప. ధనాధన్ షాట్ల పారవశ్యంలో మునిగిపోవడం తప్ప! టీ20లో 200 పరుగులు చేయడం కూడా ఓ గొప్పేనా అనేలా.. 300 చేరుకోవడమే లక్ష్యమనేలా సన్రైజర్స్ చెలరేగిపోతోంది. మొదట బ్యాటింగ్కు వచ్చిందంటే చాలు విధ్వంసమే. స్టేడియం ఊగిపోవాల్సిందే. చేతులెత్తి ఎత్తి అంపైర్లు అలసిపోవాల్సిందే. నృత్యం చేసి చేసి చీర్ లీడర్స్ కాళ్లు నొప్పి పుట్టాల్సిందే. మొదటి బంతి నుంచే ఊచకోత. చివరి బంతి వరకూ అదే బౌండరీల మోత. ఓ మోస్తారు స్కోరు చేయడం.. మళ్లీ దాన్ని ప్రత్యర్థి అందుకుంటుందేమో అని కంగారు పడటం.. ఇవన్నీ ఎందుకు? ముందుగానే ప్రత్యర్థికి అందని స్కోరు చేస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ఉండొచ్చని అనుకున్నారేమో సన్రైజర్స్ బ్యాటర్లు శివాలెత్తుతున్నారు. తమ బౌలర్లకు ఒత్తిడి తొలగిస్తున్నారు. సన్రైజర్స్ను మొదట బ్యాటింగ్కు ఆహ్వానించాలంటేనే ప్రత్యర్థి జట్లకు భయం పుట్టేలా.. బౌలింగ్ చేయాలంటేనే వణుకు వచ్చేలా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఉప్పల్లో ఆడుతున్నామా? ప్రత్యర్థి మైదానంలో ఉన్నామా? అనే తేడే లేదు. ఎక్కడైనా ఒకటే వీరవిహారం. హైదరాబాద్లో ముంబయిపై 277 పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన జట్టుగా 11 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన సన్రైజర్స్.. బెంగళూరులో సునామీ సృష్టించి ఆర్సీబీపై ఏకంగా 287 పరుగులు చేసింది. ఇప్పుడు దిల్లీలో డీసీపై విరుచుకుపడింది. ఆ ఆరంభం చూస్తే 300 ఏంటీ.. 400 అయినా సాధ్యమే అనిపించింది. ఈ సీజన్ ముందు సన్రైజర్స్ ఒక్క సారి కూడా 231కి పైగా స్కోరు చేయలేదు. కానీ ఈ సీజన్లో ఇప్పటికే 3 సార్లు 260 దాటేసింది. దిల్లీపై 266 పరుగులు చేసినా సన్రైజర్స్ తక్కువ స్కోరే సాధించిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు నెలకొల్పుతున్న బ్యాటింగ్ ప్రమాణాలు అలాంటివి మరి.
బాదుడంటే..: జట్టులో ఈ మార్పునకు కారణం ఏంటీ అంటే.. ముందుగా దృక్పథంలో వచ్చిన మార్పు గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ టైటిళ్లు అందించిన కమిన్స్ ఈ సారి సన్రైజర్స్ సారథిగా వచ్చాడు. సీజన్కు ముందే జట్టు దూకుడుగా ఆడుతుందని కమిన్స్ హెచ్చరిక జారీ చేశాడు. జట్టుకున్న బీభత్సమైన బ్యాటింగ్ ఆర్డర్ మరో కారణం. ఈ సీజన్తోనే సన్రైజర్స్ తరపున తొలిసారి ఆడుతున్న హెడ్ మామూలుగా రెచ్చిపోవడం లేదు. భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ విధ్వంసం వేరే లెవల్. ఈ ఇద్దరు కలిసి జట్టుకు సంచలన ఆరంభాలను అందిస్తూ రికార్డు స్కోరుకు బాటలు వేస్తున్నారు. పవర్ప్లేలో బాదడమే ఈ ఓపెనర్ల పని. దిల్లీపై 125 పరుగులతో టీ20 మ్యాచ్లో పవర్ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్రైజర్స్ ప్రపంచ రికార్డు సృష్టించిందంటే కారణం ఈ ఓపెనింగ్ జోడీ. ఇప్పటికే ఓ శతకం చేసిన హెడ్ 6 ఇన్నింగ్స్లో 216 స్ట్రైక్రేట్తో 324 పరుగులు చేయడం విశేషం. అభిషేక్ శర్మ 215కు పైగా స్ట్రైక్రేట్తో 7 ఇన్నింగ్స్లో 257 పరుగులు సాధించాడు. వీళ్ల స్ఫూర్తితో ఇతర బ్యాటర్లూ రెచ్చిపోతున్నారు. వీళ్లు అందించిన ఆరంభాన్ని తన ఊచకోతతో క్లాసెన్ (7 ఇన్నింగ్స్లో 198 స్ట్రైక్రేట్తో 268) మరోస్థాయికి తీసుకెళ్తున్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (3 ఇన్నింగ్స్లో 159 స్ట్రైక్రేట్తో 115), షాబాజ్ అహ్మద్ (5 ఇన్నింగ్స్లో 161 స్ట్రైక్రేట్తో 129) కూడా అలవోకగా భారీ షాట్లు ఆడుతున్నారు. ఇక ఫినిషర్గా సమద్ (5 ఇన్నింగ్స్లో 216 స్ట్రైక్రేట్తో 119) మెరుపు ముగింపునిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. 300 కొట్టడం తమ లక్ష్యమని ఈ మ్యాచ్కు ముందు హెడ్ చెప్పాడు. ఇప్పుడది అందలేకపోయినా ఈ సీజన్లో మాత్రం కచ్చితంగా సన్రైజర్స్ రికార్డు సాధించేలాగే ఉంది. ఇక బౌలర్లంటే భయం లేకుండా, పరిస్థితులంటే బెరుకు లేకుండా ఆడటం మరో ప్రధాన కారణం. టీ20 అంటేనే ఎంటర్టైన్మెంట్. ఈ సీజన్లో సన్రైజర్స్ ఆ ఎంటర్టైన్మెంట్ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. టీ20 క్రికెట్కు ముఖచిత్రంగా, బాదుడుకు సరికొత్త నిర్వచనంగా సన్రైజర్స్ హైదరాబాద్ మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్