సంక్షిప్త వార్తలు(5)
బిష్కెక్ ప్రపంచ క్వాలిఫయర్స్లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్ కోసం మరోసారి ట్రయల్స్ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్ సమాఖ్య యోచిస్తోంది.
ఆ రెజ్లర్లకు మరోసారి ట్రయల్స్!
దిల్లీ: బిష్కెక్ ప్రపంచ క్వాలిఫయర్స్లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్ కోసం మరోసారి ట్రయల్స్ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్ సమాఖ్య యోచిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ కోసం 18 కోటాలు అందుబాటులో ఉండగా ఇటీవల బిష్కెక్ టోర్నీలో భారత్ కేవలం 4 స్థానాలే దక్కించుకోగలిగింది. వినేశ్ ఫొగాట్ (50 కేజీ), అంతిమ్ ఫంగాల్ (53 కేజీ), అన్షు మలిక్ (57 కేజీ), రీతిక (76 కేజీ) ఈ కోటాలు సాధించారు. మే 9న టర్కీలో మొదలయ్యే టోర్నీలో 14 విభాగాల్లో బెర్తులు సాధించడానికి భారత్కు అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ఒలింపిక్స్లో తప్పకుండా అర్హత సాధిస్తున్న పురుషుల ఫ్రీస్టయిల్లో.. మన రెజ్లర్లెవరూ ఇప్పటిదాకా బెర్తు దక్కించుకోకపోవడం రెజ్లింగ్ సంఘాన్ని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో 14 కేటగిరిల్లో మరోసారి ట్రయల్స్ నిర్వహించి టర్కీకి జట్టును పంపాలని సంఘం భావిస్తోంది.
ఉగాండా కోచ్గా అభయ్శర్మ
దిల్లీ: టీ20 ప్రపంచకప్లో పాల్గొనే ఉగాండా జట్టుకు మాజీ దేశవాళీ ఆటగాడు అభయ్శర్మ చీఫ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఉగాండా కోచ్గా అభయ్ త్వరలోనే బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల అభయ్కు ఇండియా-ఎ, భారత అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించిన అనుభవముంది. భారత మహిళల జట్టుతో కూడా పనిచేశాడు. ఈ ఏడాది జూన్లో అమెరికా- వెస్టిండీస్లో జరిగే పొట్టి కప్పుకు ఆఫ్రికా నుంచి నమీబియా, ఉగాండా అర్హత సాధించాయి. టీ20 కప్ సన్నాహాల్లో భాగంగా 15 రోజుల పాటు శ్రీలంకలో ఉగాండా జట్టు సాధన చేయనుంది. స్థానిక జట్లతో మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది.
నిరాశపరిచిన భారత రేస్ వాకర్లు
అంటల్యా (టర్కీ): ప్రపంచ అథ్లెటిక్స్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు నిరాశ పరిచారు. పదిమంది ఈ ఈవెంట్లో పాల్గొంటే సెర్విన్ సెబాస్టియన్ మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకోగలిగాడు. అంతేకాక ఒక్కరు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (గంటా 20 నిమిషాల 10 సెకన్లు) అందుకోలేకపోయారు. పురుషుల 20 కి.మీ నడకలో సెబాస్టియన్ (గంటా 21 నిమిషాల 39 సెకన్లు) 20వ స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత వికాస్ సింగ్ (గంటా 21 నిమిషాల 59 సెకన్లు) కాస్త మెరుగ్గా 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో పూజ కుమావత్ (గంటా 40 నిమిషాల 27 సెకన్లు) మాత్రమే ఉత్తమంగా 42వ స్థానంలో నిలిచింది. కానీ ఆమెతో పాటు మంజు రాణి (గంట 40 నిమిషాల 31 సెకన్లు), ముత్తురత్నం (గంటా 40 నిమిషాల 33 సెకన్లు) రమణ్దీప్ కౌర్ (గంట 42 నిమిషాల 12 సెకన్లు), పాయల్ (గంట 42 నిమిషాల 32 సెకన్లు)లలో ఎవరూ ఒలింపిక్ అర్హత మార్కు (గంటా 29 నిమిషాల 20 సెకన్లు) దారిదాపుల్లోకి రాలేకపోయారు.
అదే అతిపెద్ద సవాలు: వినేశ్
బిష్కెక్ (కిర్గిస్తాన్): వచ్చే నాలుగు నెలల పాటు బరువును కాపాడుకోవడమే అతిపెద్ద సవాల్ అని భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అదరగొట్టిన వినేశ్ (50 కేజీలు).. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఒలింపిక్స్ కోసం వినేశ్ అత్యల్ప వెయిట్ కేటగిరీకి మారింది. ‘‘నా బరువును మెరుగ్గా నిర్వహించుకోవాలి. చాలా కష్టపడి 50 కేజీల బరువుకు తగ్గా. ఇదే బరువును కొనసాగించేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తా. అయితే నా కండరాలు బలంగా ఉండటంతో బరువు పెరగకుండా ఉండటం అంత సులువు కాదు. వచ్చే నాలుగు నెలల్లో ప్రతి రోజూ నాకు ముఖ్యమే’’ అని వినేశ్ పేర్కొంది.
భారత రెజ్లర్లు విఫలం
బిష్కెక్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్లు పేలవ ప్రదర్శన చేశారు. ఒక్కరు కూడా ఒలింపిక్ బెర్త్ సంపాదించలేకపోయారు. పోటీలో ఉన్న భారత రెజ్లర్లలో సునీల్ (87కేజీ) ఒక్కడే ఓ బౌట్లో నెగ్గగలిగాడు. మిగతా అందరూ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. సునీల్ క్వార్టర్ఫైనల్లో పోరాడి ఓడాడు. అశు (67కేజీ), సుమిత్ (60కేజీ), వికాస్ (77కేజీ), నితేశ్ (97కేజీ), నవీన్ (130కేజీ) మొదటి రౌండ్ దాటలేకపోయారు. భారత గ్రీకో రోమన్ రెజ్లర్లు చివరిసారి 2016లో ఒలింపిక్స్లో పోటీపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?