ఒలింపిక్స్కు బల్రాజ్, అక్ష్దీప్, ప్రియాంక
ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్, పారాలింపిక్ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్ ఆటగాడు బల్రాజ్ పన్వర్ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో బల్రాజ్ మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు.
దిల్లీ: ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్, పారాలింపిక్ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్ ఆటగాడు బల్రాజ్ పన్వర్ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో బల్రాజ్ మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. రోయింగ్లో భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొదటి క్రీడాకారుడు బల్రాజే. రేస్ వాకింగ్లో భారత్కు మరో ఒలింపిక్ బెర్తు ఖరారైంది. మిక్స్డ్ రిలే టీమ్ విభాగంలో అక్ష్దీప్ సింగ్-ప్రియాంక గోస్వామి పారిస్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆదివారం ప్రపంచ అథ్లెటిక్స్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో అక్ష్దీప్ జంట 3 గంటల 5 నిమిషాల 3 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 18వ స్థానంలో నిలిచింది. 20 కి.మీ నడకలో భారత అథ్లెట్లు నిరాశ పరిచారు. పురుషుల్లో సెర్విన్ సెబాస్టియన్ (గంటా 21 నిమిషాల 39 సెకన్లు) 20వ స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత వికాస్ సింగ్ (గంటా 21 నిమిషాల 59 సెకన్లు) కాస్త మెరుగ్గా 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో ఒక్కరు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (గంటా 20 నిమిషాల 10 సెకన్లు) అందుకోలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్